Breaking News

Kulgam: జమ్మూకశ్మీర్‌లో గ్రైనేడ్ దాడి... ఒక పోలీస్ మృతి


జమ్మూకశ్మీర్‌లో( (Kulgam)) మరోసారి ఉగ్రవాదులు రెచ్చిపోయారు. కుల్గామ్ జిల్లాలో గ్రైనేడ్ దాడి జరిగింది. ఆ దాడిలో ఓ పోలీసు సిబ్బంది ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన శనివారం జరిగింది. ఈ విషయంలో జమ్మూకశ్మీర్ పోలీసులు ధ్రువీకరించారు. దాడిలో తాహిర్ ఖాన్ అనే పోలీసు చనిపోయినట్టు ట్విట్టర్‌లో పేర్కొన్నారు. కాగా రాజౌరీ జిల్లాలోని ఆర్మీ క్యాంపుపై ఆత్మాహుతి దాడిని భారత సైన్యం నిర్వీర్యం చేసిన కొన్ని రోజుల తర్వాత ఈ దాడి జరగడం గమనార్హం.

By August 14, 2022 at 10:40AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/police-personnel-killed-as-terrorists-launch-grenade-in-kulgam-of-jammu-kashmir/articleshow/93552105.cms

No comments