Breaking News

ప్రధాని పర్యటనకు ముందు కశ్మీర్‌లో కలకలం.. ఎన్‌కౌంటర్లలో ఆరుగురు ముష్కరులు హతం


జాతీయ పంచాయతీ రాజ్ దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏప్రిల్ 24న ప్రధాని నరేంద్ర మోదీ జమ్మూ కశ్మీర్‌లో పర్యటించనున్నారు. సాంబ జిల్లాల్లో జరిగే కార్యక్రమంలో ప్రధాని పాల్గొననున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాని పర్యటన కోసం భారీ భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. ఇదే సమయంలో ఉగ్రవాదులు పలు చోట్ల దాడులకు కుట్ర పన్నినట్టు నిఘా వర్గాలకు సమాచారం అందింది. దీంతో సైన్యం ఎక్కడికక్కడ ముమ్మరంగా సోదాలు నిర్వహిస్తోంది. అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తోంది.

By April 22, 2022 at 10:35AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/6-terrorists-and-cisf-officer-killed-in-jammu-kashmir-encounter-ahead-of-pm-modi-tour/articleshow/90994659.cms

No comments