Breaking News

ఘోర విషాదం.. ఐదుగురు పిల్లలు సహా భార్యాభర్తలు సజీవదహనం


ఊరుకాని ఊరు నుంచి బతుకుదెరువు కోసం వచ్చిన ఓ కుటుంబం.. అగ్ని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన విషాద ఘటన పంజాబ్‌లో జరిగింది. ఓ డంపింగ్ యార్డ్ వద్ద గుడిసెను వేసుకుని.. తమ ఐదుగురు పిల్లలతో భార్యాభర్తలు నివాసం ఉంటున్నారు. కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న వీరిని విధి చిన్నచూపు చూసింది. అగ్ని ప్రమాదం రూపంలో ఏడుగుర్ని మృత్యదేవత కబళించింది. గుడిసెకు నిప్పంటుకోవడంతో ప్రమాదంలో వీరంతా ప్రాణాలు కోల్పోవడం బాధాకరం.

By April 20, 2022 at 10:10AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/family-of-7-charred-to-death-as-catches-fire-in-ludhiana-of-punjab/articleshow/90950144.cms

No comments