Breaking News

పంజాబ్‌‌లో హామీని నిలబెట్టుకున్న ఆప్.. జులై 1 నుంచి ఇళ్లకు 300 యూనిట్ల ఫ్రీ కరెంట్


పంజాబ్‌లో అధికారంలోకి వ‌స్తే 300 యూనిట్లలోపు వినియోగించేవారికి ఉచితంగా విద్య‌త్ అందజేస్తామని గతేడాది జూన్‌లోనే ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. అలాగే, ఎన్నికల మ్యానిఫేస్టోలోనూ దీనిని చేర్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల వాగ్దానాన్ని నిలబెట్టుకునే దిశగా ఆప్ ప్రభుత్వం శుక్రవారం కీలక నిర్ణయం తీసుకుంది. ఇప్పటికే పంజాబ్‌లో వ్యవసాయానికి ఉచిత కరెంట్ పథకం అమల్లో ఉన్న విషయం తెలిసిందే.

By April 16, 2022 at 10:26AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/punjab-government-announces-300-units-of-free-power-from-july-2022/articleshow/90873370.cms

No comments