Breaking News

లఖింపూర్ ఖేర్ హింస: కేంద్ర మంత్రి కుమారుడికి బెయిల్.. పలు సందేహాలు లేవనెత్తిన హైకోర్టు


లఖింపూర్ ఖేరీ హింసాత్మక ఘటనలో ప్రధాన నిందితుడు కుమారుడు ఆశిష్ మిశ్రాకు బెయిల్ మంజూరయ్యింది. లఖింపూర్ ఖేర్ హింసాత్మక ఘటనలో నలుగురు రైతులు సహా 8 మంది మృతి చెందిన విషయం తెలిసిందే. ఆశిష్‌ మిశ్రాకు అలహాబాద్‌ హైకోర్టు గురువారం బెయిల్‌ మంజూరు చేసింది. గతేడాది అక్టోబరు 3న సాగుచట్టాలకు వ్యతిరేకంగా రహదారిపై ఆందోళన చేస్తున్న రైతులపైకి ఆశిష్‌ మిశ్రా కాన్వాయ్ దూసుకెళ్లడంతో నలుగురు ప్రాణాలు కోల్పోయారు. ఈ ఘటనతో కోపోద్రేకులపై రైతులు కేంద్ర మంత్రి కుమారుడి అనుచరులపై దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో ఓ పాత్రికేయుడు సహా మరో నలుగురు మరణించారు. ఈ కేసులో అరెస్టైన ఆశిష్‌ నాలుగు నెలలుగా జైల్లో ఉన్నారు. అతడి బెయిల్‌పై విచారణ చేపట్టిన హైకోర్టు గత నెల 18న తీర్పును రిజర్వు చేసింది. గురువారం బెయిల్‌ ఇస్తున్నట్లు ప్రకటించింది. ఈ సందర్భంగా ఆశిష్ మిశ్రాకు వ్యతిరేకంగా పోలీసులు ఎఫ్ఐఆర్‌లో పేర్కొన్న పలు అంశాలపై సందేహాలు వ్యక్తం చేసింది. ‘‘కేసు వాస్తవాలు, పరిస్థితులను పూర్తిగా పరిశీలిస్తే ఎఫ్‌ఐఆర్ ప్రకారం.. నిరసనకారులపై కాల్పుల జరిపినట్టు పాత్రపై ఎఫ్ఐఆర్‌లో స్పష్టంగా తెలియజేశారు.. అయితే దర్యాప్తు సమయంలో మాత్రం మృతుల ఒంటిపై అటువంటి గాయల్లేవని గుర్తించారు’ అని వ్యాఖ్యానించింది. రైతులపైకి వాహానాన్ని నిందితుడు ఆశిష్ మిశ్రా పోనిచ్చినట్టు ఆరోపణలు ఉన్నాయి.. ఆందోళనకారులపైకి డ్రైవర్‌ను ఉసిగొల్పినట్టు ప్రాసిక్యూషన్ ఆరోపించింది.. అయితే, డ్రైవర్‌తో పాటు వాహనంలో ఉన్న మరో ఇద్దరిని ఆందోళనకారులు చంపారు.. ఆశిష్ మిశ్రా విచారణ అధికారికి సమన్లు పంపినప్పుడు ఆయన ముందు హాజరయ్యారని ఇప్పటికే ఛార్జిషీటు దాఖలు చేశారని కోర్టు పేర్కొంది. ‘అటువంటి పరిస్థితుల్లో, దరఖాస్తుదారు బెయిల్‌పై విడుదల చేయడానికి అర్హులని ఈ కోర్టు అభిప్రాయపడింది.. ఎస్‌యూవీలో డ్రైవర్‌తో సహా ముగ్గురు వ్యక్తులు నిరసనకారుల చేతిలో హత్యకు గురికావడంపై తాము కళ్లు మూసుకోలేం.. ఇది నిరసనకారుల క్రూరత్వాన్ని స్పష్టంగా వెల్లడించింది’ అని వ్యాఖ్యానించింది.


By February 11, 2022 at 08:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/allahabad-high-court-gave-bail-to-union-minister-son-ashish-mishra-in-lakhimpur-kheri-violence/articleshow/89492385.cms

No comments