Breaking News

నా భర్తను చంపింది ఆ హీరోయినే! ఓర్వలేక హత్య చేశారంటూ ఓపెన్ అయిన సీనియర్ నటి


సినీ పరిశ్రమలో మనకు తెలియని, మన దాకా రాని ఎన్నో సీక్రెట్స్ దాగి ఉంటాయి. సాధారణ ప్రజల్లో లాగే సెలబ్రిటీల జీవితాల్లోనూ కష్టసుఖాలు, ఒడిదొడుకులు ఉంటాయి. కానీ సమయం, సందర్భం వచ్చినప్పుడే అవి బయటపడుతుంటాయి. ఈ నేపథ్యంలోనే తన జీవితంలో చోటుచేసుకున్న చేదు ఘటన గురించి మాట్లాడుతూ ఓపెన్ అయ్యారు సీనియర్ నటి . దాదాపు 200కు పైగా సినిమాల్లో నటించిన కృష్ణవేణి జీవితంలో ఎన్నో రహస్యాలు దాగి ఉన్నాయి. అయితే తాజా ఇంటర్వ్యూలో తన వ్యక్తిగత విషయాల గురించి, లైఫ్ స్ట్రగుల్స్ గురించి ఆమె చెప్పుకొచ్చారు. మొదట పదేళ్ల వయసులోనే బాల్య వివాహం చేసుకున్న ఆమె.. 13 ఏళ్లకే ఓ బిడ్డకు జన్మనిచ్చారు. ఆ తర్వాత భర్తతో వచ్చిన విబేధాల కారణంగా విడాకులు తీసుకొని చాలా ఏళ్లకు రెండో పెళ్లి చేసుకున్నారు. అయితే ఆ దర్శకుడితో పెళ్లయ్యాక నాలుగేళ్లకే ఆయన చనిపోయారు. తాజాగా ఆ మరణం వెనుక ఉన్న రహస్యాలు వెల్లడించారు కృష్ణవేణి. అప్పుడప్పుడే ఇండస్ట్రీలో నిలదొక్కుకుంటున్న సమయంలో ''వారాలబ్బాయి, శ్రీమతి గారు, ముగ్గురు మిత్రులు'' లాంటి సినిమాలు చేసిన డైరెక్టర్ రాజాచంద్రతో పరిచయం మొదలై పెళ్లి కూడా చేసుకున్నామని చెప్పారు కృష్ణవేణి. మొదట ఆర్థికంగా ఎన్నో కష్టాలు అనుభవించిన రాజాచంద్ర ఇండస్ట్రీలో బాగా ఎదుగుతుండటం చూసి కొందరు జీర్ణించుకోలేక ఆయన్ను చెంపేశారని ఆమె తెలిపారు. ఆయన సినిమాలు భారీ హిట్స్ సాదిస్తుండటం ఓర్వలేక ఇండస్ట్రీ వాళ్లే ఆయనను హత్య చేసి యాక్సిడెంట్‌గా చిత్రీకరించారని కృష్ణవేణి అన్నారు. ఆ సమయంలో పోలీసులు కూడా సహాయం చేయలేదని, కాకపోతే ఆ మరణం వెనుక ఏం జరిగిందనేది తనకు పూర్తిగా తెలుసని ఆమె చెప్పుకొచ్చారు. తన భర్త హత్య వెనుక ఓ ప్రముఖ హీరోయిన్ హస్తం ఉందని ఆమె అన్నారు. కరెంటు వైర్లు పెట్టి, పీక పిసికి ఊపిరాడకుండా చేసి హత్య చేయించింది ఆ హీరోయినే అంటూ సంచలన ఆరోపణలు చేశారు కృష్ణవేణి. అయితే ఆ హీరోయిన్ ఎవరనేది చెప్పని కృష్ణవేణి.. తన భర్త మరణం తర్వాత కొన్నేళ్లకు ఆ హీరోయిన్ కూడా షుగర్‌తో చనిపోయిందని చెప్పారు.


By February 18, 2022 at 08:57AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/senior-actress-krishnaveni-says-about-her-husband-death/articleshow/89654584.cms

No comments