Breaking News

దేశంలో కరోనా కేసులు భారీగా తగ్గాయ్.. కొత్తగా లక్షా 7 వేలమందికి కరోనా, 16 శాతం తగ్గుదల


దేశంలో భారీగా తగ్గుతున్నాయి. కొత్తగా 1,07,474 కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి, శనివారంతో పోలిస్తే 16 శాతం తగ్గాయి. రేటు 7.42 శాతానికి పడిపోయింది. మరణాల సంఖ్య కూడా స్వల్పంగా తగ్గి 865 మంది మరణించారు. వైరస్‌ నుంచి 2,13,246 మంది కోలుకున్నారు. యాక్టివ్ కేసులు 12,25,011 ఉన్నాయి. మొత్తం మరణాల సంఖ్య 5,01,979కు చేరుకుంది. దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ వేగవతంంగా జరుగుతుంది. కొత్తగా 45,10,770 టీకా డోసులను పంపిణీ చేశారు. ఇప్పటి వరకు మొత్తం 1,69,46,26,697 డోసులు పంపిణీ చేసినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ తెలిపింది. డిసెంబర్ నుంచి ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా వేగంగా కేసులు పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా ఈ పరిస్థితి ఏర్పడింది. ప్రపంచ వ్యాప్తంగా కొత్తగా 22 లక్షల మందికి కరోనా సోకింది. ఎనిమిది వేల మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. అమెరికా, ఫ్రాన్స్, బ్రెజిల్, రష్యా, జర్మనీల్లో కరోనా కేసుల పరంపర కొనసాగుతూనే ఉంది. యూఎస్‌లో కొత్తగా 2.05 లక్షల మందికి పాజిటివ్‌గా తేలింది. 1,051 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో ఒక్కరోజే 2.14 లక్షలకు పైగా కోవిడ్ కేసులు బయటపడ్డాయి. బ్రెజిల్లో కొత్తగా 1.54 లక్షల మందికి వైరస్ సోకగా.. 800 మంది చనిపోయారు. రష్యాలో తాజాగా 1.77 లక్షలకు పైగా కరోనా కేసులు బయటపడ్డాయి. జర్మనీలో కూడా ఇదే పరిస్థితి నెలకొంది. అన్ని దేశాల్లో కోవిడ్ ఆంక్షలు అమల్లో ఉన్నాయి.


By February 06, 2022 at 11:34AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-logs-107474-fresh-corona-cases-with-865-deaths/articleshow/89380125.cms

No comments