Breaking News

థర్డ్‌ వేవ్‌లో ఆస్పత్రిలో చేరికలు తగ్గాయ్.. మరణించిన వారిలో ఎక్కువ మంది వారే..!


దేశంలో కేసులు అత్యధిక స్థాయిలో వెలుగుచూస్తున్నాయి. మహారాష్ట్ర, ఢిల్లీ, కేరళ, కర్ణాటకలతో సహా ఇతర రాష్ట్రాల్లో ఎక్కువ మంది కరోనా బారిన పడుతున్నారు. గంటల వ్యవధిలోనే పెద్దస్థాయిలో వేలాది మంది కొత్తవారికి పాజిటివ్‌గా నిర్ధారణ అవుతుంది. డెల్టా వేరియంట్‌తో పాటు, ఒమిక్రాన్ ‌కూడా వ్యాపిస్తోంది. వైరస్‌ సోకిన వారు చాలామంది మృత్యువాత పడుతున్నారు. అయితే మొదటి వేవ్, సెకండ్ వేవ్‌తో పోలిస్తే థర్డ్‌వేవ్‌లో మరణాల సంఖ్య తక్కువగా ఉందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ వేవ్‌లో మృతి చెందినవారిలో 60 శాతం మంది టీకాలు తీసుకోని వారు లేదా ఒక్క వ్యాక్సిన్ డోసు మాత్రమే తీసుకున్నవారు ఎక్కువగా ఉన్నట్టు అని మాక్స్ హెల్త్ కేర్ నిర్వహించిన స్టడీలో తేలింది. అలాగే మరణించినవారిలో అత్యధికులు 70 ఏళ్లకు పైబడిన వారేనని తెలిపింది. వీరి కూడా కరోనాతో పాటు ఇతర వ్యాధులతో బాధపడుతున్నవారేనని పేర్కొంది. వ్యాక్సిన్ తీసుకోవడం వల్లే ఈ వేవ్‌లో ఆస్పత్రుల్లో చేరే వారికి సంఖ్య కూడా తక్కువగా ఉంటున్నట్టు అధ్యయనంలో వెల్లడైంది. మాక్స్ హెల్త్ గ్రూప్ మెడికల్ డైరక్టర్, డాక్టర్ సందీప్ బుద్ధిరాజా ఆధ్వర్యంలో కరోనా మొదలైనప్పటి నుంచి ఈ జనవరి 20వ తేదీ వరకు సంస్థ స్టడీ నిర్వహించింది. అందులో ఈ విషయాలు వెల్లడయ్యాయి. అంతేకాదు థర్డ్‌ వేవ్‌లో 23.4 శాతం మంది మాత్రమే ఆక్సిజన్ సాయంతో చికిత్స పొందారని అధ్యయనంలో తెలిసింది. అదే మొదటి దశలో 63 శాతం, రెండో వేవ్‌లో 74 శాతం మందికి ఆక్సిజన్ అవసరం అయిందని తేలింది. అలాగే ఆస్పత్రిలో చేరికలు కూడా చాలా తక్కువగా ఉన్నట్టు తెలిసింది. మొదటి దశలో 20,883, రెండో దశలో 12,444, మూడో దశలో 1378 మంది ఆస్పత్రిలో చేరినట్టు స్టడీలో తేలింది. సెకండ్ వేవ్‌లో ఆస్పత్రులు కరోనా బాధితులతో నిండిపోయాయి. అప్పుడు బెడ్ దొరకడం కూడా కష్టతరమైంది.


By January 23, 2022 at 09:13AM


Read More https://telugu.samayam.com/coronavirus/partial-or-unvaccinated-account-for-60-percent-of-deaths-in-third-wave-says-study/articleshow/89069147.cms

No comments