Breaking News

కాంగ్రెస్ అభ్యర్థి ఫోటోలు వైరల్… అలా చూడొద్దన్న నటి అర్చన గౌతమ్


ఉత్తర్ ప్రదేశ్‌లో ఎన్నికల వేడి రాజుకుంది. ఎలాగైనా విజయం సాధించేందుకు రాజకీయ పార్టీలు వ్యూహ, ప్రతి వ్యూహాలతో ముందుకు వెళ్తున్నాయి. గెలుపును సొంతం చేసుకోవడానికి తమదైన శైలిలో కసరత్తు చేస్తున్నాయి. దీంతోపాటు పార్టీల్లో నేతల రాజీనామాలు, చేరికలు జోరందుకున్నాయి. పార్టీల్లో టికెట్‌ కేటాయింపులపై అసంతృప్తులు వ్యక్తమవుతున్నాయి. అయితే అక్కడ తాజాగా కాంగ్రెస్ మహిళా అభ్యర్థి‌ బికిని పిక్స్ వైరల్ అయ్యాయి. దీంతో మహిళా అభ్యర్థిని టార్గెట్ చేశారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నటి, మోడల్ అయిన అర్చన గౌతమ్ 2021లో కాంగ్రెస్‌లో చేరారు. యూపీ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఆమెకు కాంగ్రెస్ పార్టీ టికెట్ కేటాయించింది. ఈ మేరకు అర్చన గౌతమ్ మీరట్‌లోని హస్తినాపూర్ స్థానం నుంచి పోటీ చేయనున్నారు. ఆమె పేరు ప్రకటించిన వెంటనే అర్చన గౌతమ్ బికినీ ఫోటోలు సోషల్ మీడియాలో ప్రత్యక్షం అయ్యాయి. దాంతో అర్చన గౌతమ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. అది తన వృత్తి అని దానిని రాజకీయం చేయవద్దని కోరుకున్నారు. అది వేరు.. ఇది వేరని అన్నారు. రెండింటిని కలపొద్దని అభ్యర్థించారు. అర్చన గౌతమ్ 2018లో మిస్ ఉత్తర్ ప్రదేశ్ టైటిల్‌ను గెలుచుకున్నారు. 2015లో గ్రేట్ గ్రాండ్ మస్తీ చిత్రంతో బాలీవుడ్‌ సినిమాలో తొలిసారిగా నటించారు. తర్వాత హసీనా పార్కర్, బారాత్ కంపెనీ వంటి చిత్రాల్లో కూడా నటించారు. ఆమె తమిళం, తెలుగు చిత్రాల్లో కూడా నటించారు. కాగా యూపీలో కాంగ్రెస్ పార్టీ 125 మందికి టికెట్లను కేటాయించింది. కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపుల్లో మహిళలకు 40 శాతం ప్రాతినిథ్యం ఇచ్చింది.


By January 15, 2022 at 01:18PM


Read More https://telugu.samayam.com/congress-woman-candidate-model-archana-gautam-bikini-pics-viral-in-up/articleshow/88913370.cms

No comments