Breaking News

దేశంలో ధనిక పార్టీగా బీజేపీ.. మూడో స్థానంలో కాంగ్రెస్!


దేశంలోనే అత్యధిక ఆస్తులు, ఆర్థిక పరిపుష్టి కలిగిన రాజకీయ పార్టీగా నిలిచింది. అసోసియేషన్ ఫర్ డెమొక్రాటిక్ రిఫామ్స్ (ఏడీఆర్) నివేదిక ప్రకారం.. 2019-20లో బీజేపీ ఆస్తుల విలువ రూ.4,847 కోట్లు. బీజేపీ తర్వాత బీఎస్‌పీ రూ.693.33 కోట్లతో రెండో స్థానంలో నిలిచింది. దేశంలోనే అత్యంత పురాతనమైన పార్టీ 588.16 కోట్లతో మూడో స్థానంలో నిలవడం గమనార్హం. జాతీయ, ప్రాంతీయ పార్టీల అప్పులు, ఆస్తులను అధ్యయనం చేసే ఏడీఆర్ తాజాగా నివేదికను రూపొందించింది. మొత్తం 7 జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులను లెక్కించి నివేదికను వెలువరించింది. నివేదిక ప్రకారం.. ఏడు జాతీయ పార్టీల ఆస్తుల మొత్తం రూ.6,988.57 కోట్లు, 44 ప్రాంతీయ పార్టీల ఆస్తుల మొత్తం 2,219.38 కోట్లుగా ఉంది. ఇక, ప్రాంతీయ పార్టీల్లో సమాజ్‌వాదీ పార్టీ 563.47 కోట్లతో (26.46 శాతం) సత్తా చాటగా, తర్వాతి స్థానాల్లో రూ.301.47 కోట్లతో టీఆర్ఎస్, 267.61 కోట్లతో అన్నాడీఎంకే నిలిచాయి. ప్రాంతీయ పార్టీల మొత్తం ఆస్తుల్లో రూ. 1,639.51 కోట్లు (76.99 శాతం) ఫిక్స్‌డ్ డిపాజిట్లు రూపంలో ఉన్నాయి. జాతీయ పార్టీలకు సంబంధించి డిపాజిట్ల కేటగిరిలో బీజేపీ రూ.3,253.00 కోట్లు, బీఎస్‌పీ రూ.618.86 కోట్లు, కాంగ్రెస్ రూ.240.90 కోట్లగా ప్రకటించాయి. ప్రాంతీయ పార్టీల్లో ఎఫ్‌డీఆర్ డిపాజిట్ల విషయానికి వస్తే ఎస్‌పీ రూ.434.219 కోట్లు, టీఆర్ఎస్‌ రూ.256.01 కోట్లు, డీఎంకే 162.425 కోట్లు, శివసేన రూ.148.46 కోట్లు, బీజేడీ రూ.119.425 కోట్లు ఉన్నట్టు ప్రకటించాయి. అలాగే, ఏడు జాతీయ పార్టీలు, 44 ప్రాంతీయ పార్టీలు తమ అప్పులను రూ.134.93 కోట్లుగా చూపించాయి. ఇందులో జాతీయ పార్టీలు రూ.74.27 కోట్లు కాగా.. కాంగ్రెస్ పార్టీ అప్పులు రూ.49.55 కోట్లు. ప్రాంతీయ పార్టీలు రూ.60.66 కోట్ల మేరకు రుణాలున్నట్టు ప్రకటించాయి. మొత్తం 44 ప్రాంతీయ పార్టీల ఆస్తులు రూ.2,219.38 కోట్లు కాగా.. 95.27 శాతం (రూ.2028.715 కోట్లు) కేవలం పది పార్టీలకు చెందిన ఆస్తులే. అలాగే, ఏడు జాతీయ, 44 ప్రాంతీయ పార్టీలు తమ అప్పులను 2019-20 ఆర్దిక సంవత్సరానికి రూ.134.93 కోట్లుగా వెల్లడించాయి. ‘‘జాతీయ రాజకీయ పార్టీలు అప్పులను 2019-20 ఆర్దిక సంవత్సరానికి రూ.74.27 కోట్లుగా ప్రకటించాయి.. ఇందులో రూ.4.26 కోట్లు అప్పుగా తీసుకోగా.. మిగతా రూ.70.01 కోట్లు ఇతర రుణాలు. వీటిలో కాంగ్రెస్ పార్టీవి 66.72 శాతం (రూ.49.55 కోట్లు).. తర్వాత ఏఐటీసీ 15.24 శాతం (రూ.11.32 కోట్లు).. ప్రాంతీయ పార్టీల మొత్తం రుణాలు రూ.60.66 కోట్లు.. ఇందులో రూ.30.29 కోట్లు అప్పుగా తీసుకోగా.. రూ.30.342 కోట్లు ఇతర రుణాలు.. ఇందులో టీడీపీవి 50.02 శాతం (రూ.30.342 కోట్లు), తర్వాత డీఎంకే 13.27 శాతం అప్పులు (రూ.8.05 కోట్లు)తో రెండో స్థానంలో ఉంది’’ అని ఏడీఆర్ తెలిపింది.


By January 29, 2022 at 09:57AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/bjp-is-richest-party-in-country-for-2019-20-financial-year-say-adr-report/articleshow/89194136.cms

No comments