Breaking News

ఉత్తరాఖండ్‌లోని స్కూల్లో కరోనా కలకలం.. 85 మంది విద్యార్థులకు కోవిడ్ పాజిటివ్


ఉత్తరాఖండ్‌లోని ఓ స్కూల్‌లో కరోనా కలకలం రేగింది. నైనిటాల్‌ జిల్లాలోని జవహర్ నవోదయ విద్యాలయలో 85 మంది విద్యార్థులకు కరోనా నిర్ధారణ అయ్యింది. పాజిటివ్‌గా తేలిన విద్యార్థులందర్నీ వివిధ హాస్టళ్లలో ఐసోలేషన్లో ఉంచారు. స్కూల్‌ను ఓ చిన్నపాటి కంటైన్మెంట్ జోన్‌గా మార్చేశారు. తొలుత 11 మంది విద్యార్థులకు కరోనా సోకినట్లు తేలింది. దీంతో ఉత్తరాఖండ్ ఆరోగ్య శాఖ అప్రమత్తమై మిగతా 488 మంది విద్యార్థుల శాంపిళ్లను సేకరించగా.. మొత్తం 85 మంది కోవిడ్ బారిన పడినట్లు నిర్ధారణ అయ్యింది. కరోనా నుంచి కోలుకున్న తర్వాత విద్యార్థులను ఇళ్లకు పంపిస్తామని విద్యాశాఖ వెల్లడించింది. డిసెంబర్ 30న 8 మంది విద్యార్థులు, ప్రిన్సిపల్‌కు కరోనా పాజిటివ్ అని తేలింది. దీంతో అప్రమత్తమైన పాఠశాల వర్గాలు 488 మంది విద్యార్థుల శాంపిళ్లను సేకరించాయి. కాగా, కొంత మంది రిపోర్టులు ఇంకా రావాల్సి ఉందని తెలుస్తోంది. ఆ స్కూళ్లోని విద్యార్థుల్లో 70 శాతం మంది జ్వరం, దగ్గు, శ్వాస సంబంధిత ఇబ్బందులను ఎదుర్కొంటున్నారని సమాచారం. కాగా, ఉత్తరాఖండ్‌లో ఒమిక్రాన్ కేసులను సైతం గుర్తించారు. ఇంతకు ముందు నాలుగు కేసులు ఉండగా.. తాజాగా మరో నాలుగు కేసులు వెలుగు చూడటంతో.. ఉత్తరాఖండ్‌లో మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 8కి చేరింది.


By January 02, 2022 at 03:13PM


Read More https://telugu.samayam.com/latest-news/85-students-test-positive-for-corona-in-uttarakhand-school/articleshow/88647403.cms

No comments