Breaking News

వరించిన అదృష్టం… పెయింటర్‌కు రూ.12 కోట్ల లాటరీ…!


అదృష్టంగా ఎవరిని ఎలా వరిస్తుందో తెలియదు. అప్పటి వరకూ కార్మికుడిగా ఉన్నవాడు. . కోటీశ్వరుడుగా మారతాడని ఎవరూ ఊహించలేం. కానీ కేరళలో ఇలాగే జరిగింది. పెయింటింగ్ వర్క్స్ చేసుకుని బతికే ఓ కార్మికుడికి ఒకటి కాదు.. రెండు కాదు ఏకంగా రూ.12 కోట్ల లాటరీ తగిలింది. ఊహించనంత ప్రైజ్ మనీ దక్కింది. కొన్నేళ్లుగా ఆయన పెయింటింగ్ వృత్తిలోనే కొనసాగుతున్నాడు. యెమనంకు సమీపంలోని కుడయంపడి గ్రామంలో సదానందన్ అనే వ్యక్తి పెయింటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయనకు 50 ఏళ్లు. అయితే ఇటీవల ఆయన ఓ లాటరీ టికెట్ కొన్నాడు. అంతే జాక్ పాక్ కొట్టాడు. క్రిస్మస్, న్యూఇయర్ సందర్భంగా నిర్వహించిన బంపర్ లాటరీలో 12 కోట్ల రూపాయలు గెలుచుకున్నాడు. సదానందన్ ఆ లాటరీ టికెట్‌ను కొన్ని గంటల ముందే కొన్నాడు. ఎప్పుడూ లాటరీ టికెట్ కొనే అలవాటు ఉన్న ఆయన .. ఈసారి మాత్రం మాంసం కొనడానికి మార్కెట్‌కు వెళ్లినప్పుడు సెల్వన్ షాపులో ఆ లాటరీ టికెట్ కొనుగోలు చేశాడు. అలా కొన్న లాటరీ టికెట్‌కు ఆదివారం ప్రైజ్ మనీ వచ్చింది. అయితే వచ్చిన డబ్బును తన పిల్లల భవిష్యత్తు కోసం ఖర్చు పెడతానని సదానందన్ చెప్పాడు. అంత డబ్బు రావడం చాలా సంతోషంగా ఉందన్నాడు. కాగా రూ.300తో కొనుగోలు చేసిన లాటరీ టికెట్ ఫస్ట్ ప్రైజ్ రూ.12 కోట్లు.. రెండో ప్రైజ్ విలువ రూ.3 కోట్లు. గత ఏడాది కూడా ఇలా ఓ మిరాకిల్ జరిగింది. సెప్టెంబర్ 2021లో కేరళలోని ఓనమ్‌కు చెందిన ఆటో డ్రైవర్ రూ.12 కోట్లు గెలుచుకున్నాడు.


By January 17, 2022 at 09:36AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/kerala-painting-worker-wins-12-crore-rupees-in-lottery-in-christmas-bumper-lottery/articleshow/88942833.cms

No comments