Breaking News

బన్నీది బంగారం లాంటి మనసు.. వాళ్ల టాలెంట్‌కు ఫిదా అయి అల్లు అర్జున్ ఏం చేశారో మీరే చూడండి


దేశంలో ప్రకృతి విపత్తులు సంభవించిన సమయాల్లో ఉదారత చాటుకుంటూ, తోచిన సాయం ప్రకటిస్తూ వస్తున్న ఐకాన్ స్టార్ .. మరోసారి తన గొప్ప మనసు చాటుకున్నారు. తన లేటెస్ట్ మూవీ ‘’ సినిమా కోసం తన టీమ్ కనబరిచిన పని తనానికి ఫిదా అయిపోయి ఏకంగా 12 మందికి గోల్డ్ రింగ్స్ బహుమతిగా ఇచ్చారు. ఒక్కో రింగ్ 10 గ్రాముల (ఒక తులం) బరువు ఉందట. తమపై ప్రేమతో బన్నీ ఇచ్చిన ఈ గోల్డ్ రింగ్స్ యూనిట్ సభ్యుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపడమే గాక తెగ సంతోష పెట్టాయట. క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా సినిమాగా 'పుష్ప' మూవీ రూపొందుతోంది. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తం శెట్టి మీడియా సంయుక్తంగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కిస్తున్న ఈ సినిమాను మొత్తం 5 భాషల్లో విడుదల చేయనున్నారు. ఈ మూవీలో సమంత చేస్తున్న స్పెషల్ సాంగ్ చేస్తుండగా.. అల్లు అర్జున సరసన రష్మిక మందన హీరోయిన్‌గా నటిస్తోంది. లారీ డ్రైవర్ పుష్పరాజ్ పాత్రలో మాసిన గెడ్డంతో అల్లు అర్జున్ కనిపించనుండగా.. పల్లెటూరు అమ్మాయిగా శ్రీ వల్లి పాత్రలో రష్మిక మందన ఫిదా చేయనుంది. ఎర్ర చందనం స్మగ్లింగ్ నేపథ్యంలో బలమైన కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను డిసెంబర్ 17న ప్రేక్షకుల ముందుకు తెస్తున్నారు. ఇటీవలే విడుదల చేసిన ట్రైలర్, ఇతర అప్‌డేట్స్ సినిమాపై ఉన్న అంచనాలకు రెక్కలు కట్టడంతో ఈ సినిమా సృష్టించబోయే ప్రభంజనం అంతా ఇంతా అని చెప్పలేం అంటున్నారు సినీ విశ్లేషకులు. రెండు భాగాలుగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ అందించిన సంగీతం మేజర్ అసెట్ కానుంది. ఇప్పటికే విడుదలైన సామీ సామీ, శ్రీ వల్లి, ఏయ్ బిడ్డా సాంగ్స్ ఆన్‌లైన్ వేదికలపై రికార్డుల సునామీ సృష్టిస్తున్నాయి. ఈ మూవీపై బన్నీ ఫ్యాన్స్ సహా అన్ని వర్గాల ప్రేక్షకులు ఓ రేంజ్ అంచనాలు పెట్టుకున్నారు.


By December 09, 2021 at 11:38AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/allu-arjun-gave-gold-rings-for-pushpa-unit-members/articleshow/88180612.cms

No comments