Breaking News

ఒమిక్రాన్ నుంచి కోలుకున్న తొలి భారతీయుడు.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్


మహారాష్ట్రలో నిర్ధారణ అయిన తొలి వ్యక్తి కోలుకున్నాడు. ఆయనకు నిర్వహించిన కోవిడ్ నిర్ధారణ పరీక్షల్లో నెగిటివ్ వచ్చింది. ఆ వ్యక్తిని బుధవారం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ చేసినట్టు అధికారులు తెలిపారు. దేశంలో నుంచి కోలుకున్న తొలి బాధితుడు ఇతడే కావడం గమనార్హం. నవంబరు చివరి వారంలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన థానే జిల్లాలోని కళ్యాణ్-దొంబివిల్లీ మున్సిపాల్టీ పరిధికి చెందిన మెరైన్ ఇంజినీర్ (33)‌ కోవిడ్ బారినపడ్డారు. దీంతో ఆయన నమూనాలను జన్యు విశ్లేషణకు పంపగా.. ఒమిక్రాన్ వేరియంట్‌గా తేలింది. ఆయనను ఆస్పత్రిలో చేర్చించి చికిత్స కొనసాగించారు. గతనెల 23న దక్షిణాఫ్రికా నుంచి దుబాయ్‌, ఢిల్లీ మీదుగా ముంబయి చేరుకున్న అతడికి పరీక్షలు నిర్వహించడంతో ఒమిక్రాన్‌ సోకినట్టు తేలింది. మరో నలుగురితో కలిసి అతడు భారత్‌‌కు రాగా.. వారి నమూనాలను కూడా జన్యు విశ్లేషణకు పంపారు. కాగా, మహారాష్ట్రలో ఇప్పటి వరకూ 10 ఒమిక్రాన్ కేసులు గుర్తించారు. కోవిడ్ పాజిటివ్ వచ్చిన మరో 65 మంది నమూనాలను జన్యు పరీక్షలకు పంపినట్టు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే వెల్లడించారు. వీరి ఫలితాలు రావాల్సి ఉందని ఆయన తెలిపారు. దక్షిణాఫ్రికాలో వెలుగుచూసిన కొత్తరకం వేరియంట్ ప్రస్తుతం 54 దేశాలకు వ్యాపించింది. ఈ వేరియంట్ డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్నా.. వైరస్ తీవ్రత మాత్రం తక్కువగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని మంత్రి రాజేశ్ అన్నారు. మరోవైపు, దేశవ్యాప్తంగా కరోనా కేసుల్లో స్వల్ప పెరుగుదల నమోదయ్యింది. గడచిన 24 గంటల్లో 9,419 మందికి కొత్తగా వైరస్ నిర్ధారణ కాగా.. మరో 159 మందిని మహమ్మరి బలితీసుకుంది. కరోనా నుంచి మరో 8,251 మంది కోలుకున్నారు. కోలుకున్నవారి కంటే కొత్త కేసులే ఎక్కువగా ఉన్నాయి.


By December 09, 2021 at 10:23AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indias-first-omicron-patient-tested-negative-and-was-discharged/articleshow/88178970.cms

No comments