Breaking News

ప్రధానితో పుతిన్ భేటీ.. అఫ్గన్ సంక్షోభం, సీమాంతర ఉగ్రవాదంపై కీలక చర్చ


భారత్‌-రష్యా 21వ వార్షిక శిఖరాగ్ర సమావేశం కోసం సోమవారం ఢిల్లీకి విచ్చేసిన రష్యా అధ్యక్షుడు .. హైదరాబాద్‌ హౌస్‌లో ప్రధాని నరేంద్ర మోదీతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరువురి మధ్య పలు అంశాలు చర్చకు వచ్చాయి. ఈ సందర్భంగా పుతిన్ మాట్లాడుతూ. భారత్‌ బలమైన శక్తి అని, కాలపరీక్షకు ఎదురొడ్డి నిలిచిన తమ మిత్రదేశమని కొనియాడారు. ఉభయ దేశాల మధ్య బంధాలు మరింత బలపడుతున్నాయని, భవిష్యత్తులోనూ వీటిని కొనసాగించేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. మోదీ మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎన్ని మార్పులు వచ్చినా... భారత్‌, రష్యా సంబంధాలు స్థిరంగా, దృఢంగా ఉన్నాయని ఉద్ఘాటించారు. భారత్‌కు రష్యా నమ్మదగిన భాగస్వామని, ఉభయ దేశాల మధ్య సహకారం మున్ముందూ కొనసాగుతుందని ఆయన ఆకాంక్షించారు. అంతకు ముందు భారత్, రష్యాల రక్షణ, విదేశాంగ మంత్రులు రాజ్‌నాథ్‌సింగ్‌, ఎస్‌.జైశంకర్‌లు... జనరల్‌ సెర్గీ షోయిగు, ర్గీ లావ్రోవ్‌లు ద్వైపాక్షిక, 2+2 సమావేశాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉభయ దేశాలు నాలుగు కీలక ఒప్పందాలపై సంతకాలు చేశాయి. అమేథీ (యూపీ)లోని ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో 6,01,427 ఏకే-203 రైఫిళ్లను సంయుక్తంగా ఉత్పత్తి చేయాలని నిర్ణయించాయి. మోదీ, పుతిన్‌ల భేటీ వివరాలను విదేశీ వ్యవహారాలశాఖ కార్యదర్శి హర్షవర్ధన్‌ శ్రింగ్లా వెల్లడించారు. ‘‘చైనా సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్టంభన సహా భారత్‌కు సంబంధించిన రక్షణ సవాళ్లన్నీ నేతల మధ్య చర్చకు వచ్చాయి. అఫ్గనిస్థాన్‌ విషయంలో ఇరు దేశాలు సన్నిహిత సంప్రదింపులు, సమన్వయం కొనసాగించాలని నిర్ణయించారు. అఫ్గన్‌ భూభాగం ఉగ్రవాదులకు ఆశ్రయమివ్వరాదని, ఉగ్రవాద చర్యలకు ఉపయోగపడకూడదని అభిప్రాయపడ్డారు. సీమాంతర ఉగ్రవాదంపై పోరాడాలని, ఉగ్రవాద వ్యతిరేక కార్యకలాపాలకు అత్యంత ప్రాధాన్యమివ్వాలని భావించారు. ఇంధన రంగంలో వ్యూహాత్మక సహకారంపైనా చర్చించారు. రెండు దేశాల మధ్య మొత్తం 28 ఒప్పందాలు కుదిరాయి’’ అని ఆయన వివరించారు. భారత సైనిక దళాల నిమిత్తం రూ.5 వేల కోట్లతో అమేథీలోని ఇండో-రష్యన్‌ రైఫిల్స్‌ ప్రైవేట్‌ లిమిటెడ్‌ కర్మాగారంలో ఏకే-203 రైఫిళ్లను సంయుక్తంగా ఉత్పత్తి, కలష్నికోవ్‌ సీరీస్‌ చిన్నపాటి ఆయుధాల తయారీకి సంబంధించిన 2019 నాటి ఒప్పందానికి సవరణ, సైనిక సహకారాన్ని మరో పదేళ్లు కొనసాగించడం, ‘ఐఆర్‌ఐసీజీ-ఎం అండ్‌ ఎంటీసీ’ సమావేశ నియమ నిబంధనలకు అంగీకారం.


By December 07, 2021 at 09:49AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/focus-on-afghanistan-terror-in-21st-india-russia-annual-summit/articleshow/88136379.cms

No comments