Breaking News

India-Pak border తీగలాగితే కదిలిన డొంక.. ఉగ్ర కుట్ర భగ్నం.. టిఫిన్ బాక్స్ బాంబు స్వాధీనం


దీపావళి వేళ దేశంలో పేలుళ్లకు ఉగ్రవాదులు చేసిన కుట్రను పంజాబ్ పోలీసులు భగ్నం చేశారు. పంజాబ్‌లోని భారత్, పాక్ సరిహద్దు జిల్లా ఫిరోజ్‌పూర్ వ్యవసాయ క్షేత్రంలో అమర్చిన టిఫిన్ బాంబు బాక్స్‌ను పోలీసులు గుర్తించారు. జలాలాబాద్ పేలుడు కేసుతో సంబంధం ఉన్న వ్యక్తులే దీనిని అమర్చినట్లు పోలీసులు తెలిపారు. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి విచారించగా టిఫిక్ బాంబు విషయం బయటపడింది. దీంతో పోలీసుల బృందం అలీకే గ్రామానికి వెళ్లి బాంబును నిర్వీర్యం చేశారు. మరోవైపు, జ‌లాలాబాద్ పేలుడు కేసుపై జాతీయ ద‌ర్యాప్తు సంస్థ ()ద‌ర్యాప్తు చేస్తోంది. ఈ పేలుళ్లతో సంబంధం ఉన్న రంజిత్ సింగ్‌కు ఆశ్రయం కల్పించిన ఆయన తండ్రి జ‌శ్వంత్ సింగ్, బ‌ల్వంత్ సింగ్‌లను తాజాగా పోలీసులు అరెస్ట్ చేశారు. రంజిత్ సింగ్‌‌కు సహకరించిన తర్లోక్ సింగ్ పరారీలో ఉన్నాడు. నిందితులపై సిద్వాన్ బెట్ పోలీస్ స్టేషన్‌లో IPC సెక్షన్లు 212, 216 చట్టవిరుద్ధ కార్యకలాపాల (నివారణ) సవరణ చట్టంలోని 18,19 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నిందితుల నుంచి రెండు పెన్ డ్రైవ్‌లు, రూ.1.5 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. నిందితులు ఇచ్చిన సమాచారంతో పంజాబ్ ఉగ్రవాద నిరోధక దళం, ఫిరోజ్‌పూర్, లూధియానా, పోలీసులు సంయుక్తంగా ఆపరేషన్ చేపట్టి టిఫిన్ బాంబును గుర్తించారు. ఈ కేసులో మరింత మందిని అరెస్టయ్యే అవకాశం ఉందని పోలీసులు తెలిపారు. పాక్ సరిహద్దుల్లో ఎప్పటికప్పుడు పేలుడు పదార్థాలను డ్రోన్ల సాయంతో పాకిస్థాన్ జారవిడుస్తోంది. ఆగస్టు 15 సందర్భంగా భారీ ఉగ్రదాడికి చేసిన కుట్రను పోలీసులు భగ్నం చేశారు.


By November 05, 2021 at 12:52PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/police-recovers-tiffin-box-bomb-hidden-in-fields-near-india-pakistan-border-in-punjab/articleshow/87535515.cms

No comments