Breaking News

Covid Tablet భారత్‌లోనూ త్వరలో కోవిడ్-19కు టాబ్లెట్.. ఆ రెండు సంస్థల ఔషధాలకు ఆమోదం!


కోవిడ్-19కు నోటి ద్వారా తీసుకునే ఔషధానికి యునైటెడ్ కింగ్‌డమ్ ప్రభుత్వం అనుమతించిన విషయం తెలిసిందే. అమెరికా ఫార్మా సంస్థ మెర్క్ అభివృద్ధి చేసిన ‘మోల్నూపిరావిర్’ ()మాత్రను అత్యవసర వినియోగం కింద బ్రిటన్ ఆమోదించింది. ఈ నేపథ్యంలో భారత్‌లోనూ మాత్రను అత్యవసర వినియోగం కింద అనుమతించనున్నారు. స్వల్ప నుంచి మోస్తరు కోవిడ్-19 చికిత్సలో ఈ ఔషధానికి మరి కొద్ది రోజుల్లో అనుమతి లభించనుందని సీఎస్ఐఆర్ కోవిడ్ స్ట్రాటజీ గ్రూప్ ఛైర్మన్ డాక్టర్ రామ్‌ విశ్వకర్మ తెలిపారు. ఈ ఔషధం తీవ్రమైన కోవిడ్-19 లేదా ఆసుపత్రిలో చేరే ప్రమాదం ఉన్న వారికి ఉద్దేశించిందని తెలిపారు. ఇక () ఔషధం పాక్స్‌లొవిడ్ ()కు మరికొంత సమయం పట్టవచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రెండు ఔషధాలు ఒక వైవిధ్యాన్ని కలిగిస్తాయని.. కరోనా వైరస్ మహమ్మారి నుంచి స్థానికంగా మారుతున్నప్పుడు టీకా కంటే ఇవి చాలా ముఖ్యమైనవి’ అని ఆయన అన్నారు. వైరస్‌పై సైన్స్ పోరులో ఔషధాలు తుది అంకానికి చెందినవి అని వ్యాఖ్యానించారు. ‘మోల్నుపిరవిర్ ఇప్పటికే మనకు అందుబాటులో ఉంటుందని నేను భావిస్తున్నాను.. ఐదు కంపెనీలు డ్రగ్ తయారీదారుతో చర్చలు జరుపుతున్నాయి.. ఏ రోజైనా ఆమోదం లభిస్తుందని నేను భావిస్తున్నాను’అని పేర్కొన్నారు. ‘UK రెగ్యులేటర్ ఆమోదానికి ముందు మోల్నుపిరావిర్ డేటాను మన రెగ్యులేటరీ పరిశీలనకు అందజేశారు.. కాబట్టి ఇప్పటికే SECలు దీనిని చూస్తున్నాయి. ఇప్పుడు వేగంగా ఆమోదం పొందుతుందని నేను భావిస్తున్నాను. అందువల్ల, వచ్చే నెలలోగా మెర్క్ ఔషధానికి ఆమోదంపై నిర్ణయం ఉంటుందని చెప్పగలను’ అని వివరించారు. తాము రూపొందించిన పాక్స్‌లొవిడ్ కోవిడ్-19 తీవ్రత ఎక్కువగా ఉన్న వ్యక్తుల్లో మరణాలు లేదా ఆస్పత్రిలో చేరే ముప్పును 89 శాతం తగ్గిస్తుందని క్లినికల్ ట్రయల్స్‌లో నిరూపితమయ్యిందని ఫైజర్ వెల్లిడించింది. ‘మెర్క్ ఇప్పటికే ఐదు కంపెనీలతో ఒప్పందం కుదుర్చుకుంది.. ఈ సంస్థ అనేక కంపెనీలకు ఈ లైసెన్స్ ఇచ్చిన విధంగా ఫైజర్ కూడా చేస్తుంది ఎందుకంటే ప్రపంచ వినియోగానికి అవసరమైన ఔషధాలను తయారు చేయడానికి ఫైజర్ భారతీయ సామర్థ్యాన్ని ఉపయోగించాల్సి ఉంటుంది’ అని విశ్వకర్మ అన్నారు. భారత్‌లో మెర్క్ ఉత్పత్తికి యుఎస్‌లో అవుతున్న 700 డాలర్ల కంటే ఖర్చు చాలా తక్కువగా ఉంటుందని, అమెరికాలో ఇది వివిధ ఇతర కారణాల వల్ల ఖర్చు ఎక్కువని అన్నారు. భారత ప్రభుత్వం రంగంలోకి దిగి ఈ కంపెనీల నుంచి పెద్దమొత్తంలో కొనుగోలు చేస్తుందని నేను భావిస్తున్నాను.. వాస్తవానికి ద్వంద్వ, అస్థిరమైన ధరల వ్యవస్థను కలిగి ఉంటారు.. చికిత్స ప్రతిసారి రూ.2000-3000 లేదా రూ.4000 ఖర్చవుతుంది.. క్రమంగా అది రూ.500- 600 లేదా రూ.1,000 తగ్గుతుందని అతను చెప్పారు’.


By November 11, 2021 at 08:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/made-in-india-anti-covid-pills-could-be-cleared-for-use-in-days/articleshow/87638721.cms

No comments