Breaking News

ఇండోనేషియాలో భారీ భూకంపం.. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని జనం పరుగులు


ఇండోనేషియాలోని గురువారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది. తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఇండోనేషియాలోని కైమానా జిల్లాలో సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో భూకంప కేంద్రం ఉన్నట్టు గుర్తించారు. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాస్త్ర, జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది. తాజా భూకంపం వల్ల ఆస్తి, ప్రాణ నష్టం వివరాలు ఇంకా తెలియరాలేదు. తరచూ భూకంపాలు సంభవించే ఇండోనేషియాలో గురువారం సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. జనం గాఢనిద్రలో ఉండగా భూకంపం రావడంతో భారీ శబ్దాలకు ఉలిక్కిపడి భయంతో బయటకు పరుగులు తీశారు. ఇండోనేషియాలోని బాలి నగరానికి 62 కి.మీ. దూరంలో సంభశించిన ఈ భూకంపం రిక్టర్ స్కేల్‌పై 4.8గా నమోదయినట్టు అమెరికా జియోలాజికిల్ సర్వే తెలిపింది. ఇండోనేషియా రెస్క్యూ ఏజెన్సీ చీఫ్ గెడే దర్మాడ్ మాట్లాడుతూ.. భూకంపం వల్ల జరిగిన ఆస్తి, ప్రాణనష్టంపై సమాచారం సేకరిస్తున్నామని తెలిపారు. శిథిలాల కింద చిక్కుకుని పలువురు గాయపడినట్టు తెలిపారు. భూకంపం కారణంగా ఒక కొండ ప్రాంతంలో కొండచరియలు విరిగిపడి, కనీసం ఇద్దరు వ్యక్తులు చనిపోయారని ఆయన తెలిపారు. కనీసం మూడు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయానని దర్మడ్ చెప్పారు. కరంగాసెమ్‌లో ఇళ్లు, ఆలయాల పైకప్పులు కూలిపోయాయి. శిథిలాల మీదపడి మూడేళ్ల చిన్నారి చనిపోయింది.


By November 11, 2021 at 11:50AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/earthquake-of-6-1-magnitude-strikes-off-near-bali-of-indonesia/articleshow/87641834.cms

No comments