Breaking News

అదొక్కటి అడగొద్దు ప్లీజ్..! కావాలంటే అలా టచ్ లోకి రండి.. లైవ్‌లో కాజల్ చెల్లెలు నిషా కామెంట్స్


హీరోహీరోయిన్ల పిల్లలు, బ్రదర్స్, సిస్టర్స్ సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వడం అనేది సినీ ఇండస్ట్రీలో కామన్. అలా వచ్చిన వారిలో తమ తమ టాలెంట్, వ్యక్తిగత పరిస్థితులను బట్టి వారి కెరీర్ కొనసాగుతుంటుంది. అలానే తెలుగు తెరపై చెల్లెలిగా కాలుమోపి ప్రస్తుతం సినిమాలు పక్కనబెట్టిన తాజాగా నెటిజన్లతో ముచ్చటిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. అక్క కాజల్ కంటే ముందే అనగా 2013లో కరణ్‌ అనే వ్యక్తిని పెళ్లాడిన నిషా.. అప్పటినుంచి సినిమాలకు దూరంగా ఉంటోంది. కాకపోతే నిత్యం సోషల్ మీడియాలో మాత్రం నెటిజన్లను టచ్‌ చేస్తూ జనం జ్ఞాపకాల్లో నిలిచిపోతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఇన్‌స్టా వేదికగా నెటిజన్లతో సరదాగా ముచ్చటించిన నిషా.. తన ఫ్యామిలీకి సంబంధించిన విషయాలతో పాటు సినీ కెరీర్‌కి సంబంధించిన సంగతులపై రియాక్ట్ అయింది. ఈ సెషన్‌లో నిషాతో మాట్లాడిన నెటిజన్లు పలు విషయాలపై తమ డౌట్స్ తీర్చుకోగా ఓ నెటిజన్‌ మాత్రం ఏకంగా ‘మేడమ్‌ మీ ఫోన్‌ నంబర్‌ ఇవ్వండి’ అని అడిగేశాడు. దీంతో ''నో.. అది మాత్రం అడగొద్దు.. నేను ఇవ్వలేను. మీరు నాతో ఏదైనా షేర్‌ చేసుకోవాలనుకుంటే దయచేసి నాకు మెయిల్‌ పంపించండి. అలాగే ఇన్‌స్టాలో డైరెక్ట్‌ మెస్సేజ్‌ చేయండి. కానీ నెంబర్ మాత్రం ఇవ్వను'' అంటూ తన రెస్పాన్స్ తెలిపింది. అదేవిధంగా మంచి స్క్రిప్ట్‌ దొరికితే మళ్ళీ సినిమాల్లోకి రీఎంట్రీ ఇచ్చే ఆలోచన ఉండనే విషయాన్ని ఆమె బయటపెట్టింది. ఇక నిషా సిస్టర్ కాజల్ అయితే పెళ్లి తర్వాత కూడా వరుస ప్రాజెక్ట్స్ చేస్తూ బిజీగా ఉంది. ప్రియుడు గౌతమ్ కిచ్లుని పెళ్లాడిన ఆమె.. ప్రస్తుతం 'ఆచార్య' సినిమాతో బిజీగా ఉంది. చిరంజీవి హీరోగా కొరటాల శివ రూపొందిస్తున్న ఈ సినిమాలో కాజల్ రోల్ కీలకం కానుందని టాక్.


By November 13, 2021 at 03:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kajal-sister-nisha-agarwal-chit-chat-with-netizens-in-latest-session/articleshow/87683408.cms

No comments