Breaking News

Bihar యువ జర్నలిస్ట్‌‌పై పెట్రోల్ పోసి నిప్పంటించి దారుణ హత్య


బిహార్‌లో యువ జర్నలిస్ట్‌ దారుణ హత్యకు గురయ్యారు. మధుబని జిల్లాకు చెందిన యువ జర్నలిస్టు, (22) నాలుగు రోజుల కిందట అదృశ్యమయ్యాడు. అయితే, శనివారం సాయంత్ర అతడు రోడ్డు పక్కన విగతజీవిగా కనిపించారు. ఒంటికి నిప్పు పెట్టడంతో మృతదేహం పూర్తిగా కాలిపోయింది. బేనిపట్టి ప్రాంతానికి బుద్ధినాథ్‌ ఝా అలియాస్‌ అవినాశ్‌ ఝా స్థానిక న్యూస్‌ పోర్టల్‌లో జర్నలిస్టుగా పనిచేస్తున్నారు. ఆయనకు కొన్నాళ్లుగా బెదిరింపులు, ప్రలోభాలకు సంబంధించి ఫోన్లు వస్తున్నాయి. ఇటీవల మెడికల్‌ క్లినిక్‌లు అన్నీ నకిలీవంటూ ఆయన ఫేస్‌బుక్‌లో ఓ పోస్టు పెట్టారు. దీంతో రంగంలోకి దిగిన అధికారులు కొన్నింటిని మూసివేయించగా.. మరికొన్నింటికి భారీగా జరిమానా విధించారు. అనంతరం రెండు రోజులకే బుద్ధినాథ్‌ అదృశ్యమయ్యారు. బేటోన్‌ గ్రామం వద్ద ఎన్‌హెచ్‌ పక్కన బుద్ధినాథ్‌ మృతదేహం లభ్యమైంది. గత మంగళవారం రాత్రి 10 గంటల తర్వాత కనిపించకుండా పోయారు. ఆయన నివాసం సమీపంలో ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాలో చివరిసారిగా రికార్డయ్యింది. మంగళవారం రాత్రి 9 గంటల తర్వాత ఇంటి నుంచి బయటకు వచ్చిన ఝా.. ఫోన్‌లో మాట్లాడుతూ సమీపంలోని మెయిన్ రోడ్డుకు వచ్చారు. ఇదే మార్గంలో అతడు అంతకు ముందు చాలాసార్లు ఫోన్ మాట్లాడుకుంటూ వచ్చినట్టు రికార్డయ్యింది. చివరిసారి 9.58 గంటలకు ఇంటి నుంచి బయటకు నడుచుకుంటూ వచ్చారు. ఝా తన ఆఫీసుకు వెళ్లుంటాడని కుటుంబసభ్యులు భావించారు. క్లినిక్ తెరిచి ఉండగా, ల్యాప్‌టాప్ కూడా ఆన్ చేసి ఉంది. బుధవారం ఉదయం కుటుంబసభ్యులు ఆందోళన చెందుతూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో కేసు నమోదుచేసిన పోలీసులు.. మొబైల్ ఫోన్‌ను ట్రేస్ చేశారు. బుధవారం ఉదయం 9 గంటలకు బేనిపట్టికి ఐదు కిలోమీటర్ల దూరంలో ఉన్న బెటౌన్ అనే గ్రామం వద్ద గుర్తించారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకున్నా ఝా ఆచూకీ లభించలేదు. రెండు రోజుల పాటు తీవ్రంగా గాలించారు. చివరకు శుక్రవారం సాయంత్రం ఓ మృతదేహం బెటౌన్ వద్ద జాతీయ రహదారి పక్కన పండి ఉందని సోదరుడికి గుర్తుతెలియని వ్యక్తి సమాచారం ఇచ్చారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు, కుటుంబసభ్యులు అది బుద్ధినాథ్ మృతదేహం‌గా గుర్తించారు.


By November 14, 2021 at 08:30AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/journalist-rti-activist-found-burned-tossed-by-roadside-in-bihar/articleshow/87693441.cms

No comments