Breaking News

Amrinder Singh కాంగ్రెస్‌కు అమరీందర్ రాజీనామా.. చంద్రబాబుపై కీలక వ్యాాఖ్యలు


ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడంతో తీవ్ర మనస్తాపానికి గురైన కెప్టెన్ .. తాజాగా కాంగ్రెస్‌తో తెగదెంపులు చేసుకున్నారు. కాంగ్రెస్‌ పార్టీతో మూడు దశాబ్దాలకుపైగా తనకున్న సుదీర్ఘ అనుబంధానికి అమరీందర్‌ ముగింపు పలికారు. కాంగ్రెస్‌కు రాజీనామా చేస్తున్నట్టు అధ్యక్షురాలు సోనియాగాంధీకి మంగళవారం లేఖను పంపించారు. అనంతరం తన భవిష్యత్తు కార్యాచరణను అమరీందర్ ప్రకటించారు. పేరుతో కొత్త పార్టీని పెడుతున్నట్టు ట్విట్టర్‌లో వెల్లడించారు. వచ్చే ఏడాది పంజాబ్‌లో శాసనసభ ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో అమరీందర్ కొత్త కుంపటి పెడుతుండటం ప్రాధాన్యత సంతరించుకుంది. అమరీందర్‌ తన రాజీనామా లేఖలో మరోసారి కాంగ్రెస్ అగ్రనాయకత్వంపై విమర్శలు గుప్పించారు. తనను ముఖ్యమంత్రి పదవి నుంచి తొలగించడానికి ‘అర్ధరాత్రి కుట్ర’ చేశారంటూ సోనియా గాంధీ సహా రాహుల్‌ గాంధీ, ప్రియాంకలపై అమరీందర్ ఆరోపణలు చేశారు. ‘‘మీ వ్యవహారశైలి నన్నెంతగానో బాధించింది.. రాహుల్‌, ప్రియాంకలను నా బిడ్డల్లా భావించినప్పటికీ వారు నన్ను అవమానించారు. వారి తండ్రి (రాజీవ్‌ గాంధీ)తో కలిసి చదువుకున్న నన్ను పట్టించుకోలేదు’’ అని లేఖలో పేర్కొన్నారు. అంతగా అనుభవం లేని చరణ్‌జీత్‌ సింగ్‌ చన్నీనీ తన స్థానంలో ముఖ్యమంత్రి చేయడాన్ని కూడా ఆయన తప్పుబట్టారు. ‘‘గతంలో ఆంధ్రప్రదేశ్‌లో ఇచ్చిన ఎన్నికల ప్రణాళికలోని హామీలను చంద్రబాబు నాయుడు 87% నెరవేర్చారన్న రికార్డు ఉంది. నేను కాంగ్రెస్‌ పార్టీ మ్యానిఫెస్టోలో 92% హామీలను నెరవేర్చా.. దేశంలో పంజాబ్ రాష్ట్రం మాత్రమే ఈ ఘనత సాధించింది.. ముఖ్యంగా కరోనా సమయంలో ప్రాథమిక విద్య, వ్యవసాయం, ఆరోగ్య రంగాల్లో ఎంతో ప్రగతి సాధించింది.. కేంద్రం తీసుకొచ్చిన నల్ల చట్టాలపై తొలిసారి తానే గొంతెత్తాను ’’ అని అమరీందర్‌ లేఖలో పేర్కొన్నారు. ‘2017 అసెంబ్లీ ఎన్నికల్లో నా నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 117 సీట్లకుగానూ 77 చోట్ల విజయం సాధించింది.. 1966లో పంజాబ్‌ రాష్ట్రం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకూ ఇదే అత్యధిక మెజార్టీ.. అలాగే, 2017లో ముఖ్యమంత్రిగా పగ్గాలు చేపట్టిన తర్వాత జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దేశవ్యాప్తంగా బీజేపీ గాలివీచినా 13 ఎంపీ సీట్లకుగానూ 8 స్థానాల్లో గెలిచాం.. అలాగే, అన్ని కార్పొరేషన్, మున్సిపల్ ఎన్నికల్లోనూ, పంచాయతీ ఎన్నికల్లో మూడింట రెండొంతుల స్థానాలు.. ఐదు ఉప-ఎన్నికల్లో నాలుగు స్థానాల్లో విజయం సాధించాం’ అని చెప్పుకొచ్చారు. ఇక, కొత్త పార్టీని ఏర్పాటుచేస్తున్న అమరీందర్ సింగ్.. గతంలోనే బీజేపీతో పొత్తుకు సంకేతాలిచ్చారు. సీఎం పదవి నుంచి తప్పించిన తర్వాత ఢిల్లీలో కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసిన విషయం తెలిసిందే. అమరీందర్ ప్రకటనపై బీజేపీ కూడా సానుకూలంగా స్పందించింది.


By November 03, 2021 at 07:59AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/captain-amarinder-singh-mentioned-about-chandrababu-naidu-poll-promises-in-his-resignation-letter/articleshow/87498705.cms

No comments