Breaking News

తప్పుడు మార్గాల్లో డేటా తీసుకుంటే రూ.5 కోట్ల ఫైన్.. జేపీసీ సంచలన నివేదిక


వ్యక్తిగత సమాచార పరిరక్షణ బిల్లు (Data Protection Bill)పై నివేదికను సంయుక్త పార్లమెంటరీ సంఘం () సోమవారం ఆమోదించింది. నివేదికపై విపక్షాల అభ్యంతరాలు తెలిపినా ఆమోదం తెలిపింది. వ్యక్తుల సమాచారాన్ని ఏ విధంగా భద్రపరచాలి? ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలు ఎంతవరకు వీటిని తీసుకోవచ్చు? అనే అంశాలపై అధ్యయనానికి 2019 డిసెంబరులో సంయుక్త పార్లమెంటరీ కమిటీని ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రెండేళ్ల పాటు క్షుణ్ణమైన అధ్యయనం అనంతరం నివేదికను రూపొందించారు. దేశ భద్రత తదితర సందర్భాల్లో ఏ వ్యక్తి నుంచీ అనుమతి తీసుకోకుండానే ప్రభుత్వం, దర్యాప్తు సంస్థలైన పోలీసులు, సీబీఐ, ఈడీ, రా, ఐబీలతో పాటు ఆధార్‌ కార్డులు జారీచేసే ఉడాయ్‌, ఆదాయపు పన్ను శాఖ, ఇతర విభాగాలు కూడా సమాచారం తీసుకోవచ్చని ప్రతిపాదించింది. ట్విటర్‌, ఫేస్‌బుక్‌లు మాత్రం తప్పకుండా వ్యక్తుల అనుమతి తీసుకోవాలని స్పష్టం చేసింది. తప్పుడు మార్గాల్లో సమాచారం తీసుకుంటే... చిన్నకేసుల్లో రూ.5 కోట్లు, లేదా ప్రపంచవ్యాప్త టర్నోవర్‌లో 2% మేర జరిమానా విధిస్తారు. పెద్ద కేసుల్లో రూ.15 కోట్లు, ప్రపంచ వ్యాప్త టర్నోవర్‌లో 4% మేర చెల్లించాల్సి ఉంటుంది. 2017లో వ్యక్తిగత గోప్యతను ప్రాథమిక హక్కుగా ప్రకటిస్తూ తీర్పునిచ్చిన సుప్రీంకోర్టు... సమాచార పరిరక్షణకు వ్యవస్థను ఏర్పాటు చేయాలని కేంద్రానికి సూచించింది. దీంతో సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్‌ బీఎన్ నేతృత్వంలో నిపుణుల కమిటీని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కమిటీ నివేదిక ఆధారంగా బిల్లు రూపొందించి 2019 డిసెంబరులో పార్లమెంటులో ప్రవేశపెట్టింది. దీనిపై నిశిత అధ్యయనానికి అన్ని పార్టీల సభ్యులతో కూడిన ఏర్పాటయింది. ఆరు నెలల్లోగా ఈ కమిటీ నివేదిక సమర్పించాలని గడువు విధించారు. 2020 బడ్జెట్‌ సమావేశాలు ముగిసేనాటికి నివేదిక సమర్పించాల్సి ఉన్నా, ఐదుసార్లు కాలపరిమితి పొడిగించారు. జేసీపీ ఛైర్మన్‌గా ఉన్న మీనాక్షి లేఖిని కేంద్రమంత్రిగా నియమించడంతో ఆమె స్థానంలో పీపీ చౌధరి బాధ్యతలు చేపట్టారు. కాగా, ఈ బిల్లులోని పలు అంశాలతో విభేదిస్తూ కాంగ్రెస్‌ సభ్యులు జైరాం రమేశ్‌, మనీశ్‌ తివారీ, గౌరవ్‌ గొగొయి, వివేక్‌ ఠంకా. తృణమూల్‌ సభ్యులు డెరెక్‌ ఓబ్రెయిన్‌, మహువా మొయిత్రా, బీజేడీ సభ్యుడు అమర్‌ పట్నాయక్‌లు నోటీసులిచ్చారు. ప్రభుత్వ సంస్థలకు ప్రత్యేక వెసులుబాటు కల్పించడం సరికాదని, వ్యక్తిగత గోప్యతకు రక్షణ కల్పించలేదని ఆరోపించారు. దీనిపై జైరాం రమేశ్ మాట్లాడుతూ.. ‘నా సూచనలు ఆమోదించలేదు.. ప్యానెల్ సభ్యులను ఒప్పించలేకపోయినందున బిల్లుపై వివరణాత్మక అసమ్మతి నోట్‌ను సమర్పించవలసి వచ్చింది’ అన్నారు. ‘‘శీతాకాలం సమావేశంలో నివేదికను అధికారికంగా సభలో ప్రవేశపెట్టే వరకూ వేచి చూడాలి.. కాబట్టి, జేపీపీ ఆమోదించిన ముసాయిదా నివేదిక చర్చించడానికి నాకు స్వేచ్ఛ లేదు.. అయితే నా అసమ్మతి నోట్‌లో వెల్లడించిన ప్రాథమిక ఆందోళన ఏమిటంటే, డేటా గోప్యతపై ఈ మొత్తం చర్చను సుప్రీంకోర్టు 9 మంది న్యాయమూర్తుల విస్తృత ధర్మాసనం.. ప్రారంభించింది. పుట్టస్వామి కేసులో ఆర్టికల్ 21 ప్రకారం గోప్యత హక్కు ప్రాథమిక హక్కు అని కోర్టు ఏకగ్రీవంగా తీర్పు చెప్పింది.. తర్వాత ఆధార్‌ విషయంలో ఐదుగురు న్యాయమూర్తుల బెంచ్ డేటా భద్రత చట్టం ఆవశ్యకతను వెల్లడించింది’ అని కాంగ్రెస్ సభ్యుడు మనీశ్ తివారీ అన్నారు.


By November 23, 2021 at 08:31AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/joint-parliamentary-committee-adopts-data-privacy-bill-report/articleshow/87860087.cms

No comments