Breaking News

నీచానికి ఒడిగట్టిన జంట.. యువతిని 16 నెలలు బంధించి పలుమార్లు రేప్ చేసి...


తమకు పుట్టిన పిల్లలు చనిపోవడంతో సంతానం కోసమని ఓ జంట దారుణానికి ఒడిగట్టింది. ఓ యువతిని బంధించి.. ఆమెపై భర్త 16 నెలలు పాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు గర్బం దాల్చి.. గత నెలలో ఓ బిడ్డకు జన్మనిచ్చింది. ప్రసవం తర్వాత యువతిని బస్టాప్‌లో పడేసి పరారయ్యారు. ఈ అమానుష ఘటన మధ్యప్రదేశ్‌లోని ఉజ్జయినిలో చోటుచేసుకోగా.. భర్త దారుణానికి అతడి భార్య సహకరించడం గమనార్హం. చివరకు బాధితురాలు పోలీసులను ఆశ్రయించడంతో వ్యవహారం వెలుగులోకి వచ్చింది. పోలీసుల కథనం ప్రకారం.. ఉజ్జయినిలోని కథ్‌ బరోడా గ్రామానికి చెందిన మాజీ ఉప సర్పంచ్ రాజ్‌పాల్ సింగ్ (38), చంద్రకాంత (26) దంపతులు. అయితే వీరికి పుట్టిన ఇద్దరు పిల్లలు కూడా చనిపోవడంతో సంతానం పొందాలని భావించారు. ఈ క్రమంలో 16 నెలల కిందట మహారాష్ట్రలోని నాగ్పూర్లో ఓ మహిళ సహాకారంతో బాధిత యువతి(21)ని కొనుగోలు చేశారు. అప్పటి నుంచి ఇంట్లోనే బందీగా ఉంచి రాజ్పాల్ సింగ్ అనేక సార్లు అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ క్రమంలో యువతి గర్భం దాల్చి.. గత నెల 25న శిశువుకు జన్మనిచ్చింది. నవంబరు 6న ఆపస్మారక స్థితిలో ఉన్న బాధితురాలిని దేవాస్ బస్స్టాప్ వద్ద పడేసి రాజ్‌పాల్‌ పరారయ్యాడు. స్పృహలోకి వచ్చిన తర్వాత బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. వారి అమానుష చర్యలను పోలీసులకు వివరించడంతో కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. ఆమె ఫిర్యాదు ఆధారంగా రాజ్పాల్ దంపతులు సహా వారి ముగ్గురు బంధువులు వీరేంద్ర, అర్జున్, కృష్ణ‌పాల్‌లను నిందితులుగా చేర్చారు. మానవ అక్రమ రవాణాకు కూడా పాల్పడినట్లు కేసుగా పేర్కొన్న పోలీసులు.. బాధితురాలిని విక్రయించిన వారి వివరాలు సేకరించేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రధాన నిందితుడు రాజ్పాల్ను అరెస్ట్ చేసినట్టు ఉజ్జయిని ఎస్పీ సత్యేంద్ర శుక్లా తెలిపారు. మిగతా వారిని త్వరలోనే పట్టుకుంటామని వెల్లడించారు. నాగ్‌పూర్‌కు పోలీస్ బృందాన్ని పంపనున్నట్టు పేర్కొన్నారు. బాధితురాలిని ఎవరి నుంచి ఎంతిచ్చి కొనుగోలు చేశారనేది తెలియాల్సి ఉందన్నారు.


By November 13, 2021 at 11:33AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/nagpur-woman-raped-and-forced-to-bear-child-by-couple-in-ujjain-of-madhya-pradesh/articleshow/87679995.cms

No comments