Breaking News

ప్ర‌భాస్‌ను ఢీ కొట్ట‌నున్న మాలీవుడ్ స్టార్‌.. ప్ర‌శాంత్ నీల్ ఐడియా మామూలుగా లేదుగా!


మ‌న టాలీవుడ్ సినీ ఇండ‌స్ట్రీలో పాన్ ఇండియా సినిమాల సంఖ్య పెరుగుతుంది. అందుకు త‌గ్గ‌ట్లు మ‌న మేక‌ర్స్ సినిమాల మేకింగ్‌ను ప్లాన్ చేసుకుంటున్నారు. హీరో, హీరోయిన్ల‌తో పాటు న‌టీన‌టుల ఎంపిక కూడా ఆ రేంజ్‌లో ఉంటోంది. ఇక ప్ర‌భాస్ సినిమాల గురించి ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. బాలీవుడ్, హాలీవుడ్ న‌టీన‌టులు, సాంకేతిక నిపుణులు ఆయ‌న సినిమాల్లో వ‌ర్క్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం ప్ర‌భాస్ న‌టిస్తోన్న పాన్ ఇండియా సినిమాల్లో స‌లార్ ఒక‌టి. కె.జి.య‌ఫ్ డైరెక్ట‌ర్ ప్ర‌శాంత్ నీల్ ఈ సినిమాను తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. ఇప్పుడు సినిమా చిత్రీక‌ర‌ణ తుది ద‌శ‌కు చేరుకుంది. తాజా స‌మాచారం మేర‌కు, ఈ సినిమాలో విల‌న్‌గా మ‌ల‌యాళ స్టార్ హీరో పృథ్వీరాజ్‌సుకుమార‌న్ న‌టించ‌బోతున్నాడ‌ట‌. సుకుమారన్ తెలుగు ప్రేక్ష‌కుల‌కు కూడా సుప‌రిచితుడే. విల‌న్‌గా న‌టించ‌డం ఆయ‌న‌కు కొత్తేమీ కాదు. బాలీవుడ్ స‌హా ప‌లు చిత్రాల్లో పృథ్వీరాజ్‌ప్ర‌తి నాయ‌కుడిగా మెప్పించారు. మ‌ల‌యాళంలో హీరోగా, ద‌ర్శ‌కుడిగా త‌న‌కంటూ ఓ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న పృథ్వీరాజ్ సుకుమారన్ తొలిసారి పాన్ ఇండియా సినిమాలో అది కూడా ప్ర‌భాస్ సినిమాలో విల‌న్‌గా న‌టించ‌డం ఇదే తొలిసారి. మ‌రి స‌లార్‌లో పృథ్వీరాజ్ పాత్ర ఎలా ఉండ‌బోతుంద‌నేది అంద‌రిలోనూ ఆస‌క్తిని పెంచుతోంది. ప‌క్కా యాక్ష‌న్ ఎంట‌ర్‌టైన‌ర్ మూవీగా రూపొందుతోన్న స‌లార్ చిత్రంలో భారీ యాక్ష‌న్ స‌న్నివేశాల‌ను ప్ర‌శాంత్ నీల్ తెర‌కెక్కిస్తున్నారు. ప్ర‌స్తుతం ఆది పురుష్ సినిమా షూటింగ్‌ను పూర్తి చేస్తున్న ప్ర‌భాస్‌, నెక్ట్స్ స‌లార్ చిత్రీక‌ర‌ణ‌లో పాల్గొంటాడు. ఆ షెడ్యూల్‌లోనే ప్ర‌భాస్‌, పృథ్వీరాజ్ సుకుమార‌న్ మ‌ధ్య స‌న్నివేశాల‌ను షూట్ చేస్తార‌ని స‌మాచారం. ఈ చిత్రాన్ని వ‌చ్చే ఏడాది ఏప్రిల్ 14న విడుద‌ల చేయాల‌ని ముందుగా అనుకున్నారు. కానీ క‌రోనా సెకండ్ వేవ్ త‌ర్వాత స‌లార్ రిలీజ్‌పై క్లారిటీ లేకుండా పోయింది. అయితే ఏప్రిల్ 14నే హోంబలే ఫిలింస్ నిర్మించిన కె.జి.యఫ్ ఛాప్టర్ 2 విడుదలవుతుంది. యష్ హీరోగా నటించిన ఈ చిత్రానికి ప్రశాంత్ నీల్ దర్శకుడు. హోంబ‌లే ఫిలింస్ నిర్మిస్తోన్న ‘స‌లార్‌’లో ప్ర‌భాస్ ద్విపాత్రాభిన‌యం చేస్తున్నాడ‌ని టాక్‌. ఇందులో ఇద్ద‌రు హీరోయిన్స్ ఉంటారు. మెయిన్ హీరోయిన్‌గా శ్రుతి హాస‌న్ క‌నిపిస్తుంటే సెకండ్ హీరోయిన్‌గా మీనాక్షి చౌద‌రి న‌టిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్త‌వ‌గానే ప్ర‌భాస్.. నాగ్ అశ్విన్ ద‌ర్శ‌క‌త్వంలో ప్రాజెక్ట్ కె సినిమాతో పాటు సందీప్ రెడ్డి వంగా ద‌ర్శ‌క‌త్వంలో రూపొంద‌బోయే స్పిరిట్ అనే సినిమాల షూటింగ్‌ను స్టార్ట్ చేస్తాడు. ఈ రెండు సినిమాలు ప్యాన్ వరల్డ్ మూవీస్‌గా రూపొందబోతున్నట్లు మేకర్స్ ఇది వరకే ప్రకటించిన సంగతి తెలిసిందే. మరో వైపు వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరి 14న , పూాజా హెగ్డే జంటగా నటించిన ‘రాధేశ్యామ్’ విడుదలవుతుంది.


By October 21, 2021 at 10:09AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/malayalam-star-prithviraj-sukumaran-antagonist-in-prabhas-salaar/articleshow/87176493.cms

No comments