Breaking News

ఒకే విమానంలో ఢిల్లీ నుంచి లక్నోకు ప్రియాంక గాంధీ, అఖిలేశ్


నాయకురాలు ప్రియాంక గాంధీ, సమాజ్‌వాదీ పార్టీ అధ్యక్షుడు అఖిలేశ్ యాదవ్‌లు శుక్రవారం ఒకే విమానంలో ప్రయాణించారు. ఇద్దరు నేతలూ ఢిల్లీ నుంచి లక్నోకు యాదృచ్చికంగా ఒకే విమానంలో ప్రయాణించడం గమనార్హం. దీంతో ప్రియాంక, అఖిలేశ్ చిరునవ్వుతూ ఒకరినొకరు పలకరించుకున్నారు. ‘‘కాంగ్రెస్ నాయకురాలు వాద్రా, సమాజ్ వాదీ పార్టీ నాయకుడు అఖిలేశ్ యాదవ్‌ల మధ్య ఢిల్లీ- లక్నో వెళ్లే విమానంలో ప్రణాళిక లేని మర్యాదపూర్వక సమావేశం జరిగింది. ఈ సమావేశం యాదృచ్ఛికంగా జరిగిందని, ఇద్దరి మధ్య ఎటువంటి రాజకీయ చర్చ జరగలేదు’’అని సమాజ్‌వాదీ పార్టీ ఓ ప్రకటనలో తెలిపింది. వచ్చే ఏడాది ఉత్తర్ ప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ఇచ్చిన ఎన్నికల హామీలను ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు ప్రియాంక గాంధీ ప్రతిజ్ఞ యాత్రను శనివారం ప్రారంభిస్తారు. ఈ నేపథ్యంల ఆమె ఢిల్లీ నుంచి లక్నోకు విమానంలో శుక్రవారం సాయంత్రం బయలుదేరి వచ్చారు. మరోవైపు, తన ఢిల్లీ పర్యటనను ముగించుకొని లక్నోకు తిరిగి వస్తూ అదే విమానంలో ప్రయాణించారు. విమానంలో తీసిన ఫొటోలో అఖిలేశ్ ధరించిన మాస్కు వెనుక నుంచి నవ్వుతూ ప్రియాంకాగాంధీని పలకరించడం కనిపించింది. యూపీ ఎన్నికలు దగ్గర పడుతున్న కొద్దీ ప్రియాంక గాంధీ, అఖిలేష్ ఇద్దరూ నేతలు అధికార బీజేపీపై విమర్శలను తీవ్రతరం చేశారు. యాదవేతర వెనుకబడిన వర్గాలను సమీకరించడంపై అఖిలేష్ దృష్టి సారించగా, మహిళలకు 40 శాతం టిక్కెట్లు కేటాయిస్తున్నట్లు ప్రియాంక ప్రకటించారు .కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా పోరాడుతుందా లేదా మిత్రపక్షాలతో ముందుకెళ్తుందా అనేది ఇప్పటికీ అస్పష్టంగా ఉంది. అయితే, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్ సమాజ్ పార్టీలు కాంగ్రెస్‌తో పొత్తును తిరస్కరించాయి. గత ఎన్నికల్లో కాంగ్రెస్, సమాజ్ వాదీ పార్టీ కలిసి పోటీ చేయగా.. ఏడు చోట్ల కాంగ్రెస్, ఎస్పీ 47 సీట్లలో విజయం సాధించాయి. ఇదిలా ఉండగా ప్రస్తుతం అఖిలేశ్, ప్రియాంక ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. లఖింపూర్ ఖేర్ ఘటనపై ఎస్పీ, బీఎస్పీల కంటే కాంగ్రెస్ ముందుగా స్పందించిన విషయం తెలిసిందే. బాధిత రైతు కుటుంబాలను పరామర్శకు బయలుదేరిన ప్రియాంకను పోలీసులు నిర్బంధించడంతో వివాదాస్పదమయ్యింది. రెండు రోజుల పాటు ఆమె నిర్బంధంలోనే ఉన్నారు. అటు, ఎస్పీ, బీఎస్పీలు యూపీ ప్రజల గొంతుకను వినిపించడంలో విఫలమయ్యాయని ప్రియాంక మండిపడ్డారు.


By October 23, 2021 at 11:04AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/congress-leader-priyanka-gandhi-up-ex-cm-akhilesh-yadav-meet-onboard-delhi-lucknow-flight/articleshow/87219526.cms

No comments