Breaking News

గొర్రెలు కాసే అమ్మాయిని.. ఎంతో కష్ట పడ్డా..! నా ఆలోచన అదేనంటూ రకుల్ ప్రీత్ సింగ్ ఓపెన్


అనే నవల ఆధారంగా టాలెంటెడ్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో రూపొందిన కొత్త సినిమా 'కొండ పొలం'. ఈ సినిమా ద్వారా మునుపెన్నడూ చూడని విలక్షణ కథను తెరపై ఆవిష్కరించబోతున్నారు క్రిష్. అటవీ నేపథ్యంలో అడ్వెంచరస్‌ చిత్రంగా రాబోతున్న ఈ మూవీలో మెగా మేనల్లుడు, 'ఉప్పెన' ఫేమ్ వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తుండగా.. బ్యూటిఫుల్ హీరోయిన్ ఆయనతో రొమాన్స్ చేస్తోంది. ఓబులమ్మగా ప్రేక్షకులకు అలరించబోతోంది. అయితే ఈ సినిమాను అక్టోబర్ 8న ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్న నేపథ్యంలో మీడియాతో మాట్లాడిన రకుల్.. పలు ఆసక్తికర విషయాలు పంచుకుంది. ప్రస్తుతం తాను సెలెక్టివ్‌గా సినిమాలు ఎంచుకుంటున్నానని, చేసే ప్రతి పాత్ర నటిగా తనను సరికొత్తగా ఆవిష్కరించేదై ఉండాలని భావిస్తున్నానని రకుల్ చెప్పుకొచ్చింది. పాత్ర పరిధి ఏంటనేది పక్కనబెడితే అది జీవితాంతం ప్రేక్షకులు గుర్తుపెట్టుకునేలా ఉండాలని ఆమె అంటోంది. ఓబులమ్మ పాత్ర గురించి వినగానే ఎంతో ఎగ్జైట్ అయి ఈ రోల్ ఓకే చేశానని, ఇది సవాల్‌తో కూడుకున్న రోల్ అని రకుల్ తెలిపింది. తాను గతంలో ''కరెంటు తీగ, రారండోయ్‌ వేడుక చూద్దాం, ఖాకీ'' సినిమాల్లో పల్లెటూరి అమ్మాయిగా కనిపించానని, కానీ ఈ 'కొండ పొలం'లో పోషించిన ఓబులమ్మ పాత్ర చాలా ప్రత్యేకం అని రకుల్ పేర్కొంది. ఇందులో గొర్రెలు కాసే అమ్మాయిగా కనిపిస్తానని, భాష, యాస, లుక్ అన్నీ కూడా చాలా విభిన్నంగా ఉంటాయని చెప్పిన ఆమె.. గొర్రెల కాపర్ల గురించి ‘కొండ పొలం’ లాంటి చిత్రం ఇంత వరకూ ఇండియాలో రాలేదని, ఈ చిత్రంలో తన రోల్ ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అవుతుందనే నమ్మకం తనలో బలంగా ఉందని తెలిపింది. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై సాయి బాబు జాగర్లమూడి, రాజీవ్‌ రెడ్డి నిర్మాణంలో రూపొందుతున్న ఈ సినిమాకు కీరవాణి బాణీలు స్పెషల్ అట్రాక్షన్ కానున్నాయి. సో.. చుడాలి మరి రెండో సినిమాగా రాబోతున్న ఈ మూవీ ఎలాంటి సెన్సేషన్ క్రియేట్ చేస్తుందనేది!.


By October 07, 2021 at 07:02AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/heroine-rakul-preet-singh-says-about-konda-polam-shoot/articleshow/86827956.cms

No comments