Breaking News

వరుడు కావలెను సాంగ్: పరికిణీలో పడుచును చూస్తే పందిరంతా జాతరే.. ఆకట్టుకుంటున్న బీట్!!


విలక్షణ కథలను ఎంచుకుంటూ ముందుకెళ్తున్న యువ హీరో ఈ సారి '' అనే కుటుంబ కథా చిత్రంలో రంగంలోకి దిగుతున్నారు. లక్ష్మీ సౌజన్యను దర్శకురాలిగా పరిచయం చేస్తూ ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను అక్టోబర్ 29న గ్రాండ్‌గా రిలీజ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిత్ర ప్రమోషన్స్ వేగవంతం చేసిన యూనిట్.. తాజాగా ఈ సినిమా నుంచి వడ్డాణం వీడియో సాంగ్ ప్రోమో రిలీజ్ చేసింది. గీతా మాధురి, ML గాయత్రి, అదితి భావరాజు, శృతి రంజని & శ్రీ కృష్ణ పాడిన ఈ పాట శ్రోతలను ఆకట్టుకుంటోంది. పరికిణీలో పడుచును చూస్తే పందిరంతా జాతరే అంటూ సాగిపోతున్న ఈ పాటకు తమన్ అందించిన బాణీలు ప్రాణం పోశాయి. రఘురాం అందించిన లిరిక్స్ అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా ఉన్నాయి. దీంతో విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ వైరల్‌గా మారింది. సితార ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగశౌర్య, రీతువర్మ జంటగా ఈ 'వరుడు కావలెను' సినిమా రూపొందించారు. చిత్రంలో నదియా, మురళీశర్మ, వెన్నెల కిషోర్, ప్రవీణ్, అనంత్, కిరీటి దామరాజు, రంగస్థలం మహేష్, అర్జున్ కళ్యాణ్, వైష్ణవి చైతన్య, సిద్దిక్ష ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. ఇప్పటివరకు విడుదలైన అప్‌డేట్స్ సినిమాపై హైప్ పెంచేశాయి. ఈ సినిమా నేటితరం ప్రేక్షకులకు బాగా నచ్చుతుందని హీరోయిన్ రీతూ వర్మ చెప్పింది. రీసెంట్‌గా విడుదలైన 'దిగు దిగు దిగు నాగ' లిరికల్ సాంగ్ ఫుల్ వీడియో తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. చూస్తుంటే ఈ మూవీ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ కావడం పక్కా అని తెలుస్తోంది.


By October 27, 2021 at 11:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/naga-shauryas-varudu-kavalenu-vaddaanam-video-song-released/articleshow/87300397.cms

No comments