Breaking News

ఏడు గంటల తర్వాత ఫేస్‌బుక్, వాట్సాప్, ఇన్‌స్టా సేవలు పునరుద్దరణ.. క్షమాపణలు చెప్పిన దిగ్గజ సంస్థ!


ప్రపంచ వ్యాప్తంగా సోమవారం రాత్రి 9 గంటల నుంచి నిలిచిపోయిన సోషల్ మీడియా దిగ్గజాలు వాట్సప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలను తిరిగి పునరుద్ధించారు. , , ఇన్‌‌స్టాగ్రామ్‌ సేవలకు కొన్ని గంటలు నిలిచిపోవడంతో వినియోగదారులు ఇబ్బంది పడ్డారు. ఏం జరిగిందో తెలియక నానా హైరానా చెందారు. దాదాపు 7 గంటల తర్వాత మంగళవారం తెల్లవారుజామున 4 గంటల నుంచి వాట్సప్‌ సేవలు పునరుద్ధరించారు. ఈ సందర్భంగా సేవల అంతరాయంపై ఫేస్‌బుక్‌ క్షమాపణలు చెప్పింది. ‘‘ప్రపంచవ్యాప్తంగా మాపై ఆధారపడిన కోట్లాది మందికి, వ్యాపార కార్యకలాపాలు నడుపుతున్న వారికి క్షమాపణలు.. నిలిచిపోయిన మా సేవలను పునరుద్ధరించడంతో తిరిగి ఆన్‌లైన్‌కు వస్తున్నందుకు సంతోషంగా ఉంది.. మాతో సహకరించినందుకు ధన్యవాదాలు’’ అని ఫేస్‌బుక్‌ ట్విటర్‌లో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ఇన్‌స్టాగ్రామ్ సేవలు నిలిచిపోవడంతో ఈ అంశం సంచలనమైంది. వీటిపై ఆధారపడ్డ కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక గందరగోళానికి గురయ్యారు. కాసేపు వాట్సాప్‌ చూడకపోతే ఏదో కోల్పోయినట్లు అనేక మంది అల్లాడిపోతారు. ఫేస్‌బుక్‌ పోస్టులు, లైక్‌ల గురించి తెలుసుకోడానికి ఆరాటపడుతుంటారు. వీడియోలు, ఫొటోలను షేర్ చేయడానికి ఇన్‌స్టాగ్రామ్ వైపు చూస్తారు. అంతగా ఈ వేదికలకు అలవాటుపడిపోయిన జనం.. సోమవారం రాత్రి 9 గంటల నుంచి స్తంభించిపోవడంతో గిలగిలలాడిపోయారు. ఈ వార్త ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ సాంకేతిక సాధనాలపై ఆధారపడిన కొన్ని కోట్ల మంది ఎందుకిలా జరిగిందో అర్థంకాక.. గంటల తరబడి నానా హైరానా పడ్డారు. సర్వర్లలో సమస్య కారణంగానే ఫేస్‌బుక్‌ తదితరాల సేవలు ఆగిపోయాయని భావిస్తున్నారు. భారత్‌లో దాదాపు 41 కోట్ల మంది ఫేస్‌బుక్‌ వినియోగదారులున్నారు. వాట్సాప్‌ను 52 కోట్ల మందికిపైగా వాడుతున్నారు. ఇన్‌స్టాగ్రాం ఖాతాదారులు 21 కోట్ల పైమాటే. వీటి సేవలు స్తంభించిపోవడంతో ట్విటర్‌, టెలిగ్రామ్‌, సిగ్నల్‌ వంటి ఇతర మాధ్యమాలకు తాకిడి ఒక్కసారిగా పెరిగిపోయింది. ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయంపై ట్విటర్లో పలువురు విమర్శలతో విరుచుకుపడ్డారు. తాజా పరిణామాన్ని ట్విటర్‌, గూగుల్‌ కూడా తప్పుపట్టాయి. ఈ ఏడాది మార్చి, జులై నెలల్లోనూ చాలాచోట్ల ఫేస్‌బుక్‌ సేవలకు అంతరాయం కలిగింది. వెబ్‌సైట్లు, యాప్‌లకు అప్పుడప్పుడుసమస్యలు రావడంసహజమే అయినా ప్రపంచవ్యాప్తంగా ఒకేసారి సేవలు స్తంభించిపోవడం అరుదు. అయితే దీనికి సైబర్‌ దాడి కారణం కాకపోవచ్చని సైబర్‌ భద్రత నిపుణులు భావిస్తున్నారు. నాస్‌డాక్‌లో ఫేస్‌బుక్‌ షేరు విలువ 5.5% మేర పతనమయింది. దాదాపు ఏడాది కాలంలో ఇంత మార్పు చోటు చేసుకోవడం ఇదే ప్రథమం.


By October 05, 2021 at 07:12AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/facebook-whatsapp-instagram-reconnecting-after-nearly-6-hour-outage/articleshow/86768662.cms

No comments