Breaking News

బెంగళూరు: ఏపీకి చెందిన సాఫ్ట్‌వేర్ యువతిపై నైజీరియన్లు అత్యాచారం


బెంగళూరులో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగినిపై ఇద్దరు నైజీరియన్లు అత్యాచారానికి పాల్పడ్డారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా బెంగళూరు పోలీసులు కేసు నమోదుచేశారు. ఇద్దరు నైజీరియన్లను బనసవాడి పోలీసులు అరెస్టు చేశారు. బాధితురాలి వివరాలను పోలీసులు వెల్లడించలేదు. ఆమెపై నిందితులు అత్యాచారానికి పాల్పడినట్టు రెండు రోజుల కిందట ఫిర్యాదు అందిందని తెలిపారు. శుక్రవారం అబుజి ఉబాకా, అంటోనీలను నిందితులుగా గుర్తించామని దర్యాప్తు అధికారులు వివరించారు. తనపై అత్యాచారం జరిగిందని బాధిత యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు దర్యాప్తు కొనసాగుతోంది. నైజీరియా రాయబార కార్యాలయానికి అరెస్టు సమాచారాన్ని పంపారు. బాధితురాలిని వైద్య పరీక్షల నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. నిందితుల్లో ఒకరైన అంటోనికి బాధితురాలితో చాలాకాలంగా పరిచయం ఉన్నట్టు తెలుస్తోంది. అతడితో సోషల్ మీడియాలో పరిచయం అయినట్టు సమాచారం. విశ్వసనీయ సమాచారం ప్రకారం ఆగస్టు 29న ఆమెతో కలిసి కమన్‌హళ్లిలోని తన స్నేహితుడి ఉబాకా ఇంటికి వెళ్లాడు. అక్కడే ముగ్గురూ కలిసి మద్యం సేవించినట్టు తెలుస్తోంది. మద్యం మత్తులో ఉన్న యువతిపై ఇద్దరూ అత్యాచారం చేసినట్టు సమాచారం. ఉదయం మేల్కొన్న యువతి.. తన పక్కనే ఉబాకా పడుకుని ఉండటంతో షాకయ్యింది. దీంతో తనపై ఇద్దరూ అత్యాచారానికి పాల్పడినట్టు గ్రహించింది. గత ఆదివారం జరిగిన ఈ ఘటనపై బాధితురాలు తమకు ఫిర్యాదుచేసిందని బనస‌వాడీ పోలీసులు తెలిపారు. ఫిర్యాదు ఆధారంగా నిందితులు ఇదర్నీ అరెస్ట్ చేశామని తెలిపారు. యువతికి వైద్య పరీక్షలు నిర్వహించనున్నట్టు పేర్కొన్నారు. బాధిత యువతి నగరంలోని ఓ ప్రముఖ సాఫ్ట్‌వేర్ సంస్థలో హెచ్ఆర్ ఎగ్జిక్యూటివ్‌గా ఉద్యోగం చేస్తోందని చెప్పారు.


By September 04, 2021 at 09:05AM


Read More https://telugu.samayam.com/latest-news/crime/two-nigerians-arrested-for-raping-andhra-pradesh-techie-woman-in-bengaluru/articleshow/85917789.cms

No comments