Breaking News

Allu Aravind: సాయి ధరమ్ తేజ్ యాక్సిడెంట్ సీసీ టీవీ ఫుటేజ్.. కొన్ని గంటల్లోనే కోలుకుంటాడు: అల్లు అరవింద్ ప్రెస్ మీట్


సాయి ధరమ్ తేజ్‌కి యాక్సిడెంట్ కావడంతో ఆయన అభిమానులు ఆందోళనలో ఉన్నారు. మెరుగైన వైద్యం కోసం మాదాపూర్ మెడికవర్ నుంచి జూబ్లీ హిల్స్‌లోని అపోలో హాస్పటల్‌కి తరలించారు. పవన్ కళ్యాణ్ హుటాహుటిన హాస్పటల్‌కి చేరుకున్నారు. ఆయనతో పాటు త్రివిక్రమ్ శ్రీనివాస్, వరుణ్ తేజ్, , వైష్ణవ్ తేజ్, చిరంజీవి సతీమణి సురేఖ, తదితరులు అపోలో హాస్పటల్‌కి చేరుకున్నారు. అయితే మీడియాలో ఆరోగ్యానికి సంబంధించి పుకార్లకు తావు ఇవ్వకుండా ఆ ఫ్యామిలీ నుంచి అల్లు అరవింద్ మీడియాతో మాట్లాడారు. ‘సాయి ధరమ్ తేజ్ కోలుకుంటున్నాడు.. కొన్ని గంటల్లోనే మామూలు పరిస్థితికి వస్తాడు. ఆయనకి ఎలాంటి ప్రమాదం లేదు.. డాక్టర్లతో నేను మాట్లాడాను.. ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు.. డాక్టర్లు హెల్త్ బులిటెన్ విడుదల చేసి మిగిలిన వివరాలు తెలియజేస్తారని’ అన్నారు అల్లు అరవింద్.


By September 11, 2021 at 12:24AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/sai-dharam-tej-is-absolutely-fine-and-recovering-says-allu-aravind/articleshow/86101176.cms

No comments