Breaking News

UP girl తండ్రిని బ్లాక్ మెయిల్ చేసి.. రూ. కోటి డిమాండ్ చేసిన 12 ఏళ్ల బాలిక!


అందుబాటులోకి వచ్చిన అంతర్జాలం, సాంకేతిక పరిజ్ఞానం పిల్లలపై ఎంత ప్రభావం చూపుతుందనడానికే ఈ ఘటనే ఉదాహరణ. తండ్రి మందలించాడని ఓ 12 ఏళ్ల బాలిక.. వాట్సప్‌ ద్వారా బెదిరించి ఏకంగా రూ.కోటి డిమాండ్‌ చేసింది. ఈ సంఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. శాలిమార్‌ గార్డెన్‌ ఏరియాకు చెందిన 12 ఏళ్ల బాలికను తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపానికి గురైన బాలిక.. తండ్రి ల్యాప్‌టాప్‌ నుంచే ఆయనకు మెసేజ్ పంపి.. రూ.కోటి ఇవ్వాలని డిమాండ్‌ చేసింది. లేకపోతే ఆయన కుమారుడు, కుమార్తెను చంపేస్తానని బెదిరించింది. దీంతో బాలిక తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు ఈ మెసేజ్ అతడి ల్యాప్‌టాప్ నుంచే వచ్చిందని గుర్తించారు. దీంతో ఖంగుతిన్న అతడు.. కూతురిని ప్రశ్నించాడు. తిట్టడం వల్లే ఈ పని చేసినట్లు బాలిక అంగీకరించింది. అయితే ఈ కేసులో పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. బాలిక ఏడో తరగతి చదువుతుండగా .. కరోనా వల్ల ఆన్‌లైన్ తరగతులు జరగడంతో తల్లిదండ్రులు ఆమెకు ఓ మొబైల్ కొనిచ్చారు. ఓ ప్రయివేట్ సంస్థలో ఇంజినీర్‌గా పనిచేస్తున్న బాలిక తండ్రి.. గత శుక్రవారం పాప వినియోగిస్తున్న వాట్సాప్ స్టాటస్‌లో అభ్యంతరకరమైన పదాలు చూసి విస్తుపోయాడు. దీనిపై బాలికను ప్రశ్నించగా.. నాకేం తెలియదని, ఫోన్ హ్యాకయ్యిందని చెప్పింది. మొబైల్ ఇక నుంచి జాగ్రత్తగా వాడుతానని చెప్పినా తల్లిదండ్రులు మాత్రం బాలిక దగ్గర నుంచి తీసేసుకున్నారు. అదే రోజు సాయంత్రం తన తల్లి, తండ్రి మొబైల్ ఫోన్‌లను వారికి తెలియకుండా తీసుకుని, వాట్సాప్ స్టాటస్‌లో అభ్యంతరకరమైన పదాలను ఉంచింది. ఈ స్టాటస్ చూసిన కొందరు బంధువులు, స్నేహితులు వారికి ఫోన్ చేసి చెప్పడంతో షాక్ తిన్నారు. దీంతో ఫోన్ హ్యాక్ అయినట్టు భావించారని ఘజియాబాద్ సైబర్ విభాగం ఎస్ఐ సుమిత్ కుమార్ తెలిపారు. అయితే, జులై 24న ఆ బాలిక తన తల్లి ఫోన్‌ను తీసుకుని కిడ్నాప్ డ్రామాకు తెరతీసింది. హ్యక్ జరిగినట్టు భావించి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. పరిశీలించిన పోలీసులు అటువంటిదేమీ జరగలేదని గుర్తించారు. ఏ4 సైజు పేపర్‌పై ‘KILL’అని రాసిన లేఖ అదే రోజు ఇంటి మెయిన్ గేట్‌కు అతికించి ఉంచడంతో పోలీసులను రప్పించారు. అక్కడ ఇటీవలే ఏర్పాటుచేసిన సీసీటీవీ కెమెరాను పరిశీలించిన పోలీసులు.. ఈ లేఖను బాలికే అంటించడంతో అవాక్కయ్యారు. దీంతో బాలిక నిర్వాకం మొత్తం బయటపడింది. తన స్నేహితులను కలవడానికి ఇంటి నుంచి వెళ్లనివ్వడం లేదని, మొబైల్ ఫోన్‌లో గేమ్స్ ఆడటం, టీవీ చూడటానికి అనుమతించకపోవడం వల్లే ఇలా చేశానని చెప్పడంతో అందరూ తెల్లమొహం వేశారు.


By August 01, 2021 at 03:16PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/minor-girl-under-covid-curfew-sends-parents-threats-in-ghaziabad/articleshow/84943409.cms

No comments