Breaking News

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా విచారిస్తుంటే.. ఆన్‌లైన్ పెళ్లికి ఎందుకు అభ్యంతరం: కేరళ హైకోర్టు


నేర విచారణలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా నమోదయ్యే వాంగ్మూలాలను న్యాయస్థానాలు పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు... ఆన్‌లైన్‌ పెళ్లుళ్లకు అభ్యంతరమేంటని ప్రశ్నించింది. వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా చేసుకొనే వివాహాలకు (ఎస్‌ఎంఏ) కింద చట్టబద్ధత కల్పించాలంటూ ఓ వ్యక్తి పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై బుధవారం విచారణ చేపట్టిన జస్టిస్ పీబీ సురేశ్‌ కుమార్‌.. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా చట్టం స్పందించాలని, లేకపోతే అది సమాజ ఎదుగుదలను అడ్డుకుంటుందని గతంలో సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యలను ఈ సందర్భంగా ప్రస్తావించారు. వివాహం చేసుకోబోయే వారిలో ఒకరు లేదా ఇద్దరు విదేశాలకు వెళ్లిపోవడం, వేర్వేరు కారణాలతో వారు స్వదేశానికి రాలేకపోవడం వంటివి చోటుచేసుకుంటున్నాయి.. ఇందుకు సంబంధించిన చాలా కేసులు తమ ముందుకు వస్తున్నాయని జస్టిస్‌ కుమార్‌ వ్యాఖ్యానించారు. ‘‘వీడియో కాన్ఫరెన్స్‌ విచారణలో ఓ సాక్షి వాంగ్మూలాన్ని కోర్టులు పరిగణనలోకి తీసుకుంటున్నప్పుడు, వివాహం చేసుకునే పార్టీలకు కూడా వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పెళ్లి చేసుకోవడానికి అవకాశం ఇవ్వాలి’’ అని అన్నారు. అనంతరం ఈ కేసును విస్తృత ధర్మాసనానికి బదిలీ చేశారు. అయితే ఈ ఆన్‌లైన్‌ వివాహాలకు కేరళ ప్రభుత్వం అభ్యంతరం వ్యక్తం చేసింది. వివాహాల రిజిస్ట్రేషన్ సమయంలో ఇరువురూ భౌతికంగా హాజరుకావాలని పేర్కొంది. వివాహం జరింపిచే అధికారి ఎదుటు ఇరు పార్టీలూ, సాక్షులు తప్పనిసరిగా హాజరు కావాలని స్పష్టం చేసింది. వివాహానికి సంబంధించిన నోటీసును జారీ చేయడానికి కనీసం 30 రోజుల ముందు రెండు పార్టీలలో కసీనం ఒకరు వివాహ అధికారి ప్రాదేశిక పరిమితుల పరిధిలో నివసిస్తూ ఉండాలని తెలిపింది.


By August 27, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/can-wedding-under-special-marriage-act-be-solemnised-online-says-kerala-hc/articleshow/85676332.cms

No comments