Breaking News

అఫ్గన్‌ తాలిబన్ల వశం.. కశ్మీర్‌లో ఆందోళకర పరిణామాలు


నుంచి అమెరికా సైనికుల ఉపసంహరణ ప్రభావం జమ్మూ కశ్మీర్‌లో స్పష్టంగా కనిపిస్తోందని నిఘా వర్గాలు వ్యాఖ్యానించాయి. కనీసం ఆరు ఉగ్రవాదుల బృందాలు కశ్మీర్‌ లోయలోకి చొరబడినట్టు తెలిపాయి. భారీ విధ్వంసమే లక్ష్యంగా ఉగ్రవాదులు ప్రవేశించినట్టు పేర్కొన్నాయి. గత నెల రోజులుగా కనీసం 25-30 మంది ఉగ్రవాదులను వివిధ భద్రతా దళాలు మట్టుబెట్టినట్టు సమాచారం. ఈ సంఖ్య జమ్మూ కశ్మీర్‌లో ఇప్పటికే ఉన్న ఉగ్రవాదులకు అదనమని సంబంధిత వర్గాలు వివరించాయి. కశ్మీర్‌లో హింస పెరుగుతుందనడానికి గత నెల రోజులుగా క్షేత్రస్థాయిలో జరుగుతున్న సంఘటనలే సాక్ష్యం. ‘గత నెల రోజులుగా ప్రతి రోజూ ఏదో ఒక చోట భద్రత బలగాలపై ఐఈడీ దాడులు లేదా రాజకీయ నేతలపై దాడులు జరుగుతున్నట్టు నివేదికలు వస్తున్నాయి’ అని సీనియర్ అధికారి ఒకరు తెలిపారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో కాల్పులు విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత లాంచ్ ప్యాడ్‌లలో ఉగ్రవాదుల కదలికలు పెరిగాయని వివరించారు. వివిధ నిఘా వర్గాల సమాచారం ప్రకారం.. నియంత్రణ రేఖ వెంబడి స్థావరాల్లో 300 మందికిపైగా ఉగ్రవాదులు మళ్లీ ఆక్రమించుకున్నాయి. ‘ఉగ్రవాదుల కదలికలు పెరగడంతో మేం కూడా అప్రమత్తమయి.. సిద్ధంగా ఉన్నాం’ అని కశ్మీర్ లోయలో ఉగ్రవాద నిరోధక ఆపరేషన్లలో పాల్గొనే ఓ సీనియర్ అధికారి తెలిపారు. రెండు వారాల కిందట అఫ్గనిస్థాన్‌ను తాలిబన్లు స్వాధీనం చేసుకున్న తర్వాత.. వారికి శుభకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో సందేశాలు వెల్లువెత్తాయని ఆయన అన్నారు. ‘ఇటీవల జమ్మూకశ్మీర్‌లో ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయి అందర్నీ ఆకర్షించింది..కొంత మంది యువకులు అఫ్గనిస్థాన్‌‌కు వెళ్లి తాలిబన్లతో కలిసి పోరాటం చేసి, పాక్ ఆక్రమిత కశ్మీర్‌కు వచ్చారు.. వీరికి పీఓకేలో ఘనస్వాగతం లభించినట్టు వీడియోలో స్పష్టమవుతోంది’ అని చెప్పారు. అటువంటి వీడియోలను సోషల్ మీడియాలో తరుచూ చూస్తూ కశ్మీర్‌లోని యువత ప్రేరణ పొందుతున్నారని తెలిపారు.ః మరో సంచలన విషయం ఏంటంటే గత కొద్ది నెలల్లో దాదాపు 60 మందికిపై యువకులు కనిపించకుండా పోయారు. దీంతో పోలీసులకు నిద్రలేని రాత్రులు గడుస్తున్నాయి. ‘వారు ఏదైనా పని కోసమని చెప్పి వెళ్లారు.. కానీ ఇప్పుడు వారు కనిపించలేదు.. ఇది తీవ్రమైన ఆందోళన కలిగించే విషయం’అని ఆయన అన్నారు. కశ్మీర్ జోన్ డీఐజీ విజయ్ కుమార్ మాట్లాడుతూ.. ‘తప్పుదారి పట్టి ఉగ్రవాదంలో చేరిన యువతను హింసను విడిచిపెట్టి, జనజీవన స్రవంతిలోకి తిరిగి రావాలని మేం అడుగుతున్నాం.. విజ్ఞప్తి చేస్తున్నాం’ అన్నారు.


By August 31, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/amid-taliban-takeover-of-afghanistan-a-worrying-trend-in-jammu-and-kashmir/articleshow/85785724.cms

No comments