Breaking News

అలా చేయడం కరెక్ట్ కాదని భావించిన నిర్మాతలు.. వెనకడుగు వేసిన ‘101 జిల్లాల అందగాడు’


కొన్ని నెలల క్రితం వరకూ కరోనా వైరస్ వ్యాప్తి భయంకరంగా ఉండేది. సెకండ్ వేవ్ రూపంలో వచ్చిన ఈ మహమ్మారి వేలాది మంది ప్రాణాలు బలిగొంది. మరోసారి చేసేదేమీ లేక ప్రభుత్వం లాక్‌డౌన్ విధించింది. ఈ నేపథ్యంలో సినిమా షూటింగ్‌లు, విడుదలు వాయిదాపడ్డాయి. లాక్‌డౌన్ ఫలితంగా కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టాయి. క్రమంగా ప్రభుత్వం కూడా దశల వారిగా నిబంధనలు సడలిస్తూ.. రీసెంట్‌గానే లాక్‌డౌన్‌ను పూర్తిగా తొలగించింది. దీంతో మళ్లీ షూటింగ్‌లు ప్రారంభం కావడం.. థియేటర్లు తెరుచుకోవడం జరిగింది. ఇప్పటికే లాక్‌డౌన్ తర్వాత పలు సినిమాలు థియేటర్‌లో విడుదలై ప్రేక్షకులను అలరించాయి. మరికొన్ని సినిమాలు అభిమానులకు విడుదలకు సిద్ధంగా ఉన్నాయి. అయితే కరోనా వ్యాప్తి నేపథ్యంలో ఒకే రోజు ఎక్కువ సినిమాలు విడుదల చేయడం కరెక్ట్ కాదు. ఎందుకంటే.. థియేటర్లకు వచ్చిన సినిమాలు చూసే ప్రేక్షకుల సంఖ్య ఇప్పటికీ తక్కువగా ఉంది. దీంతో ఒకే రోజు చాలా సినిమాలు విడుదల చేయడం వల్ల ఏదో ఒక సినిమాకు తీవ్రస్థాయిలో నష్టం వాటిల్లే అవకాశం ఉంది. కరెక్ట్‌గా ఇప్పుడు ఇలాంటి పరిస్థితే నటించిన ‘’ సినిమా యూనిట్‌కి ఎదురైంది. ఈ సినిమాను ముందు ఆగస్టు 27న విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ ప్రకటించింది. కానీ, అదే రోజున సుధీర్ బాబు నటించిన ‘శ్రీదేవీ సోడా సెంటర్’, సుశాంత్ నటించిన ‘ఇచట వాహనాలు నిలుపరాదు’ సినిమాలు కూడా విడుదల కానున్నాయి. దీంతో కాస్త వెనక్కి తగ్గిన ‘101 జిల్లాల అందగాడు’ టీమ్ సినిమా విడుదలను సెప్టెంబర్ 3వ తేదీకి వాయిదా వేసుకుంది. ఇక ఈ సినిమాకు దర్శకత్వం వహించగా.. అవసరాల శ్రీనివాస్ స్వయంగా కథ అందించారు. దిల్ రాజు, క్రిష్ జాగర్లమూడి సమర్పణలో శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది.


By August 15, 2021 at 08:56AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/101-jillala-andhagadu-team-postpones-release-to-september-3/articleshow/85342375.cms

No comments