Breaking News

ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టివేత.. మహిళ ఎక్కడ దాచిందంటే


ఢిల్లీ ఎయిర్ పోర్ట్ లో కస్టమ్స్ అధికారులు మరోసారి బంగారాన్ని పట్టుకున్నారు. ఢిల్లీ ఎయిర్ పోర్టులో కాబుల్ నుండి వచ్చిన ప్రయాణికురాలి వ్యవహారశైలిపై కస్టమ్స్ అధికారులకు అనుమానం వచ్చింది. వెంటనే ఈ లేడీ కిలాడీని అదుపులోకి తీసుకుని తమదైన స్టైల్లో విచారణ చేశారు. దీంతో లేడీ కిలాడీ ఆట కట్టించడంతో అక్రమ బంగారం రవాణా గురించి గుట్టు రట్టు అయ్యింది. ఈ లేడీ కిలాడీ ఎంతో తెలివిగా కస్టమ్స్ అధికారులకు ఏమాత్రం అనుమానం రాకుండా బంగారాన్ని కరిగించి వేస్ట్ గా మార్చింది. లోదుస్తుల్లో దాచిపెట్టి అక్రమంగా బంగారాన్ని తరలించే ప్రయత్నం చేసింది. ఈ లేడీ కిలాడీ అఫ్ఘాన్ దేశస్థురాలిగా కస్టమ్స్ అధికారులు గుర్తించారు. వెంటనే ఆమెను అదుపులోకి తీసుకుని ఆమె వద్ద ఉన్న 800 గ్రాముల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ బంగారం విలువ 37 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు వెల్లడించారు. కస్టమ్స్ అధికారులు అక్రమ బంగారం రవాణా కేసు కింద కేసు నమోదు చేసుకుని దర్యాప్తు కొనసాగిస్తున్నారు.


By July 14, 2021 at 10:25AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/gold-seized-in-delhi-airport-police-arrest-afghan-woman/articleshow/84398656.cms

No comments