Breaking News

భారత్ ఎగుమతి చేసిన గేదె మాంసంలో కోవిడ్ మూలాలు.. కాంబోడియా సంచలన ప్రకటన


భారత్‌ నుంచి దిగుమతి చేసుకున్న గేదె మాంసంలో కరోనా వైరస్ ఆనవాళ్లను గుర్తించినట్లు కంబోడియా ప్రభుత్వం వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్‌ నుంచి వచ్చిన మాంసం కంటైనర్లలో మూడింటిని నిలిపేసినట్లు పేర్కొంది. ఒక ప్రైవేట్‌ సంస్థ రవాణా చేసిన అయిదు కంటైనర్లలో మూడింటిని నిలిపివేసినట్లు కాంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. ఇందులోని మాంసాన్ని వారం తరువాత నాశనం చేస్తామని వివరించారు. కాంబోడియాలోని కెంపాంగ్ స్పే రాష్ట్రం ఒరాల్ జిల్లాలో వచ్చే రెండు మూడు రోజుల్లో మాంసాన్ని దగ్దం చేస్తామని ఆ రాష్ట్ర గవర్నర్ వై సామ్నాంగ్ తెలిపారు. ఒరాల్ జిల్లా అధికారులకు ఈ మేరకు జులై 26న మార్గదర్శకాలను జారీచేసిన గవర్నర్.. ఈ విషయంలో సహకరించాలని జిల్లా యంత్రాంగాన్ని కోరారు. -19 వ్యాప్తి చెందకుండా ఉండాలంటే మాంసాన్ని తప్పనిసరిగా కాల్చాలని సామ్నాంగ్ నొక్కి చెప్పారు. అంతేకాదు, మాంసం కొనుగోలు చేయడానికి ముందు ఎక్కడ నుంచి దిగుమతి చేసుకున్నారనే వివరాలను ప్రజలు అడగాలని సూచించారు. నిల్వ చేసిన మాంసంలో కరోనా వైరస్ ఆనవాళ్లు ఉన్నట్టు కాంబోడియా ప్రభుత్వం జులై 24న ప్రకటించింది. ఈ ఏడాది మార్చి నుంచి భారత్‌లో కరోనా కేసులు భారీగా పెరగడంతో దిగుమతులను కంబోడియా తాత్కాలికంగా నిలిపేసింది. ఇటీవల కొవిడ్‌ కేసులు తగ్గుముఖం పడుతుండటంతో మళ్లీ దిగుమతులకు అనుమతి ఇచ్చింది. ఈ క్రమంలో మంగళవారం భారత్‌ నుంచి వచ్చిన గేదె మాంసం కంటైనర్లలో కరోనా మూలాలను గుర్తించినట్లు కంబోడియా ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ నేపథ్యంలో భారత్ నుంచి దిగుమతులపై మరోసారి నిషేధం విధించేందుకు సిద్ధమవుతోంది.


By July 28, 2021 at 08:36AM


Read More https://telugu.samayam.com/latest-news/international-news/cambodia-says-found-coronavirus-in-imported-buffalo-meat-from-india/articleshow/84813368.cms

No comments