Breaking News

దేశంలో మరో రెండేళ్లు వర్క్ ఫ్రమ్ హోం.. 95 కంపెనీల అభిప్రాయమిదే


నేపథ్యంలో తమ ఉద్యోగులకు ప్రభుత్వ, ప్రయివేట్ సంస్థలు విధానాన్ని అమలు చేస్తున్నాయి. ముఖ్యంగా ఐటీ కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్‌కు మొగ్గుచూపుతున్నాయి. దీంతో ఉద్యోగులంతా ఇంటి వద్ద నుంచే సేవలను అందిస్తున్నారు. ఈ విధానంతో కొన్ని ఇబ్బందులు ఎదురైనా సంస్థలకు మాత్రం ప్రయోజనం కలుగుతోంది. మెయింటెనెన్స్, ఇతర ఖర్చులు భారీగా తగ్గి.. ఉత్పత్తి పెరిగింది. ఇదిలా ఉండగా, థర్డ్ వేవ్ హెచ్చరికల నేపథ్యంలో వర్క్ ఫ్రం హోం మరికొన్ని రోజులు కొనసాగుతుందన్న అంచనాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో వర్క్ ఫ్రమ్ హోమ్ ఎన్నాళ్లు కొనసాగుతుందనే అంశంపై చెన్నై కేంద్రంగా పనిచేసే జోహో కార్పొరేషన్‌ ఓ సర్వే నిర్వహించింది. ఆ సంస్థ ఐటీ మేనేజ్‌మెంట్ విభాగం మేనేజ్ ఇంజిన్ నిర్వహించిన సర్వేలో పలు ఆసక్తి కరమైన విషయాలు వెల్లడయ్యాయి. భారత్‌లోని 95 శాతానికిపైగా సంస్థలు మరో రెండేళ్ల పాటు వర్క్ ఫ్రమ్ హోం విధానాన్ని కొనసాగించే అవకాశం ఉందని అభిప్రాయం వ్యక్తమయ్యింది. ఈ సర్వేలో ఉత్తర అమెరికా, యూకే, ఆస్ట్రేలియా, న్యూజిలాండ్, సింగపూర్, భారత్‌కు చెందిన 1,210 మంది ఐటీ ఎగ్జిక్యూటివ్స్, టెక్నాలజీ ప్రొఫెషనల్స్ పాల్గొన్నారు. భారత్ నుంచి 500లకుపైగా ఉద్యోగులున్న 202 సంస్థల ప్రతినిధులు ఇందులో ఉన్నారు. అయితే, వర్క్ ఫ్రమ్ హోం విధానం వల్ల తమ సంస్థలకు భద్రతా పరమైన సవాళ్లు పెరిగినట్టు 89 శాతం మంది అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఐటీ రంగానికి ఈ ముప్పు ఎక్కువగా ఉన్నట్టు తెలిపారు. కోవిడ్ -19 మహమ్మారి కారణంగా కనీసం 97 శాతం కంపెనీలు క్లౌడ్ సొల్యూషన్స్‌పై ఆధారపడుతున్నాయి.. వ్యాపార విశ్లేషణలు, కృత్రిమ మేధస్సులో పెరుగుదల కనిపించిందని 96 శాతం మంది చెప్పారు. 10 మందిలో తొమ్మిది మందికి పైగా అధికారులు, ఐటీ నిపుణులు మహమ్మారి వల్ల క్లౌడ్ కంప్యూటింగ్ వాడకం పెరిగిందని తెలిపారు. కృత్రిమ మేధస్సుపై విశ్వాసం పెరిగినట్లు 91 శాతం కంపెనీలు వివరించాయి. మంచి ఫలితాలను పొందినట్టు 89 శాతం సంస్థలు పేర్కొన్నాయి. భవిష్యత్తులో సంస్థను నడిపించడానికి టెక్ నాయకత్వ బృందం వర్క్ ఫ్రమ్ హోమ్‌ను భారీగా విశ్వసించిందని అధ్యయనం వెల్లడించింది. అమ్మకాలు, మార్కెటింగ్, ఫైనాన్స్ వంటి ఇతర విభాగాల వారితో పోల్చితే ఐటీ ఉద్యోగులు మంచి సన్నద్ధత కలిగి ఉన్నారని 86 శాతం మంది అభిప్రాయపడ్డారు. ‘ఐటి ఓ క్లిష్టమైన వ్యాపార మార్గంగా ఉందని నివేదిక వెల్లడిస్తోంది.. ప్రస్తుత కాలంలో వైవిధ్యతను పెంపొందించడానికి డేటా-ఆధారిత నిర్ణయాధికారం ముఖ్యమని కంపెనీలు గ్రహించాయి.. కృత్రిమ మేధ, లోతైన విశ్లేషణలపై ఆధారపడటాన్ని పెంచుతుంది’ అని జోహో మేనేజ్ ఇంజైన్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ గణేషన్ అన్నారు.


By July 20, 2021 at 08:14AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/indian-firms-to-continue-with-remote-work-for-next-two-years-says-zoho-survey/articleshow/84572520.cms

No comments