Breaking News

అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆగస్టు 31 వరకు నిషేధం పొడిగింపు


అంతర్జాతీయ విమాన సర్వీసులపై ఆగస్టు 31 వరకు నిషేధం పొడిగిస్తున్నట్టు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) శుక్రవారం ప్రకటించింది. దేశంలో కరోనా కేసులు మళ్లీ క్రమంగా పెరుగుతుండటంతో ఈ నిర్ణయం తీసుకుంది. కరోనా కారణంగా గతేడాది మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమాన సర్వీసులపై నిషేధం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఎంపిక చేసిన పలు మార్గాల్లో మాత్రమే ప్రయాణికుల విమానాలను నడపనున్నట్టు తెలిపింది. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఆగస్టు నెలాఖరు వరకు విమానాల రద్దు నిర్ణయాన్ని పొడిగిస్తున్నట్టు ప్రకటనలో వెల్లడించింది. కరోనా వైరస్‌ వ్యాప్తితో గతేడాది మార్చి నుంచి అంతర్జాతీయ ప్రయాణికుల విమాన సర్వీసులను రద్దుచేసినప్పటికీ వందే భారత్‌ మిషన్‌ కింద కొన్ని దేశాలకు ప్రత్యేక సర్వీసులను నడుపుతోంది. ఎయిర్ బుబుల్‌లో భాగంగా అమెరికా, యూకే, యూఏఈ, కెన్యా, భూటాన్‌, ఫ్రాన్స్‌ సహా దాదాపు 24 దేశాలకు విమానాలు నడపడంపై కేంద్రం ప్రత్యేక ఒప్పందం చేసుకుంది. దీని ప్రకారం ప్రత్యేక అంతర్జాతీయ విమాన సర్వీసులను ఈ దేశాలకు నడుపుతున్నారు. తాజాగా ప్రకటించిన నిబంధనలు కార్గో విమానాలు, తాము ప్రత్యేక అనుమతులు జారీ విమానాలకు మాత్రం వర్తించవని డీజీసీఏ స్పష్టంచేసింది. ఇప్పటికే దేశీయ ప్రయాణికుల విమాన సర్వీసులు యథాతథంగా నడుస్తున్న విషయం తెలిసిందే. గతేడాది కరోనా కట్టడికి విధించిన లాక్‌డౌన్ ఆంక్షలు సడలించిన తర్వాత మే 25 నుంచి దేశీయ విమానాలు ప్రారంభమయ్యాయి. కానీ, గత 17 నెలలుగా అంతర్జాతీయ విమాన సర్వీసులపై బ్యాన్ అలాగే కొనసాగుతోంది. మళ్లీ ఇప్పుడు నెల రోజుల పాటు ఈ నిషేధాన్ని పొడిగించడం గమనార్హం.


By July 31, 2021 at 08:18AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/restrictions-on-international-passenger-flights-extended-till-august-31-says-dgca/articleshow/84912948.cms

No comments