Breaking News

కోవిడ్‌పై పోరాడగలమనే నమ్మకాన్ని యోగా కలిగించింది.. జాతినుద్దేశించి మోదీ ప్రసంగం


సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ సోమవారం ఆన్‌లైన్ ద్వారా జాతినుద్దేశించి ప్రసంగించారు. కోవిడ్ మహమ్మారిస్‌తో పోరాడగలమనే నమ్మకం మధ్య ప్రజల అంతర్గత బలానికి యోగా వనరుగా మారిందని అన్నారు. ‘‘కోవిడ్ వ్యాప్తి మొదలైనప్పుడు ఏ దేశమూ సిద్ధంగా లేదు... ఈ సమయంలో యోగా అంతర్గత బలానికి ఓ వనరుగా మారింది.. స్వీయ క్రమశిక్షణకు యోగా సహకరిస్తుంది.. కోవిడ్‌తో పోరాడగలమనే విశ్వాసం ప్రజలలో కలిగించింది.. వైరస్‌తో పోరాటానికి యోగాను ఒక సాధనంగా మార్చారని ఫ్రంట్‌లైన్ వర్కర్లు చెప్పారు’’ అని అన్నారు. యోగా తరచూ సంపూర్ణ ఆరోగ్యానికి ఒక మార్గాన్ని ఇస్తుంది... యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, రోగనిరోధకశక్తిపై ప్రపంచవ్యాప్తంగా అనేక అధ్యయనాలు జరుగుతున్నాయని ఆయన అన్నారు. ‘‘కోవిడ్ సమయంలో అనేక అధ్యయనాలు జరుగుతున్నాయి.. మన శరీరంపై యోగా వల్ల కలిగే ప్రయోజనాలు, రోగనిరోధక శక్తిపై పరిశోధనలు జరుగుతున్నాయి.. ఆన్‌లైన్ తరగతుల్లోనూ యోగా, ప్రాణాయామ వంటి వ్యాయామాలు చేయిస్తున్నారు.. ఇది వైరస్‌తో పోరాడటానికి పిల్లలకు సహాయపడుతుంది’’ అని ప్రధాని పేర్కొన్నారు. ‘‘ఒత్తిడి నుంచి బలం.. ప్రతికూలత నుంచి సృజనాత్మకత వరకు ఉన్న మార్గాన్ని యోగా చూపిస్తుంది.. చాలా సమస్యల గురించి యోగా చెబుతుంది..కానీ, మనలో అనంతమైన పరిష్కారాలు ఉన్నాయి.. అనంత విశ్వంలో అతిపెద్ద శక్తి వనరులం మనం’’ అని ప్రధాని తెలిపారు. ‘ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) సహకారంతో భారత్ మరో ముఖ్యమైన కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది... M- యోగా యాప్ ద్వారా ప్రపంచవ్యాప్తంగా ఉన్న వివిధ భాషలలో యోగా శిక్షణ వీడియోలను అందుబాటులోకి తీసుకొస్తున్నాం.. ఇది 'వన్ వరల్డ్, వన్ హెల్త్' నినాదానికి తోడ్పాటు అందిస్తుంది’అని మోదీ వివరించారు. ప్రపంచంలోని ప్రతి మూలకూ యోగాను తీసుకెళ్లాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని వయసుల వారి సమస్యలకు యోగా పరిష్కారం చూపుతుందని మోదీ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, పురాతన శాస్త్రవిజ్ఞానం కలయిక అందరికీ ప్రయోజనం చేకూర్చుతుందని, ఆరోగ్య సంరక్షణలో యోగా నిరంతరం సానుకూల ధోరణికి సహకరిస్తుందని చెప్పారు.


By June 21, 2021 at 07:47AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/yoga-remains-a-ray-of-hope-as-the-world-fights-covid-pandemic-says-pm-modi/articleshow/83704800.cms

No comments