Breaking News

విషాదం.. గోడకూలి ముగ్గురు చిన్నారుల దుర్మరణం


ఉత్తరప్రదేశ్‌లో విషాదం చోటు చేసుకుంది. ఆగ్రా జిల్లాలో కగరోల్ గ్రామంలో మంగళవారం రాత్రి గోడ కూలింది. ఈ ఘటనలో ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. పలువురు గాయాలపాలయ్యారు. మృతుల్లో ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారు. దీంతో స్థానికులు వెంటనే స్పందించి శిథిలాల్లో చిక్కుకున్న వారిని రక్షించేందకు ప్రయత్నించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని శిథిలాల్లో చిక్కుకున్న వారందరినీ రక్షించి, ఆసుపత్రికి తరలించారు. అక్కడ ముగ్గురు పిల్లలు చనిపోయినట్లు వైద్యులు ప్రకటించారు. గాయపడినవారు చికిత్స పొందుతున్నారు. ప్రమాదంలో మొత్తం తొమ్మిది మంది గాయపడ్డారని, మృతుల్లో ఇద్దరు బాలికలు, ఓ బాలుడు ఉన్నారని ఆగ్రా జిల్లా మెజిస్ట్రేట్‌ ప్రభు ఎన్‌ సింగ్‌ తెలిపారు.


By June 16, 2021 at 07:46AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/three-children-died-after-a-wall-collapsed-in-kagarol-up/articleshow/83561666.cms

No comments