Breaking News

మరికాసేపట్లో కేంద్ర కేబినెట్ భేటీ..లాక్ డౌన్, థర్డ్ వేవ్‌పై కీలక చర్చ


ఇవాళ జరగనుంది. ప్రధాని నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్‌ సమావేశం జరుగనుంది. ఉదయం 11 గంటలకు వర్చువల్‌ విధానంలో సమావేశం జరుగనుంది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై చర్చించనున్నట్లు సమాచారం. ఈ సమావేశంలో కోవిడ్ థర్డ్ వేవ్‌పై కేంద్ర మంత్రివర్గం చర్చించనుంది. థర్డ్ వేవ్ వ్యాపిస్తుందన్న హెచ్చరికలతో కట్టడికి తీసుకోవాల్సిన నియంత్రణ చర్యలతో పాటు లాక్ డౌన్ విషయంలో కూడా చర్చించి కీలక నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి. అలాగే, కరోనాతో కుదేలైన ఆర్ధిక పరిస్థితిపై కూడా చర్చించనుంది. సెకండ్‌ వేవ్‌తో విధించిన లాక్‌డౌన్‌తో.. దెబ్బతిన్న వర్గాలను ఆదుకునే దిశగా ఈ కేబినెట్‌లో సమాలోచనలు చేయనున్నారు. లాక్ డౌన్ కారణంగా దేశంలో వ్యాపార, వాణిజ్య రంగాలు చాలా దెబ్బతిన్నాయి. దేశ జీడీపీ మైనస్‌లోకి పడిపోతుందన్న ఆందోళనను ఆర్థిక వేత్తలు వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. సమావేశంలో మంత్రులతో పాటు వివిధ శాఖల ఉన్నతాధికారులు సైతం పాల్గొననున్నారు. మరోవైపు, సుప్రీంకోర్టు వ్యాఖ్యలు… రాష్ట్రాల డిమాండ్‌ నేపథ్యంలో వ్యాక్సిన్‌పై ఇటీవల ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కీలక ప్రకటన చేశారు. దేశవ్యాప్తంగా 18 సంవత్సరాలు దాటిన వారందరికీ వ్యాక్సిన్‌ వేయించే బాధ్యత కేంద్రమే తీసుకుంటుందని ప్రకటించారు. కరోనా టీకాల కోసం రాష్ట్ర ప్రభుత్వాలు రూపాయి కూడా ఖర్చు పెట్టాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. సమావేశంలో వివిధ రాష్ట్రాల్లో వైరస్‌ పరిస్థితులపై కూడా ప్రధాని సమీక్ష నిర్వహించనున్నారు.


By June 16, 2021 at 10:38AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/pm-modi-holds-union-cabinet-meeting-today/articleshow/83564110.cms

No comments