Breaking News

ఆంధ్రా రికార్డ్ ఒక్క రోజులోనే బ్రేక్: ప్రధాని మోదీ హర్షం.. వెల్‌డన్ ఇండియా!!


ప్రక్రియలో భారతదేశం సరికొత్త రికార్డును నెలకొల్పింది. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని సోమవారం ఒక్కరోజే ఏకంగా 84 లక్షల మంది ప్రజలకు వ్యాక్సిన్ వేశారు. ఇంత పెద్ద సంఖ్యలో వ్యాక్సినేషన్ తీసుకోవడం ఇదే ప్రథమం. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఓ ట్వీట్ చేసింది. ఇక, ఆదివారం దాదాపు 14 లక్షల మందికి వ్యాక్సిన్ వేసి ఆంధ్రప్రదేశ్ సృష్టించిన రికార్డును.. ఒక్క రోజులోనే మధ్యప్రదేశ్ రాష్ట్రం బ్రేక్ చేసింది. మధ్యప్రదేశ్‌లో సోమవారం అత్యధికంగా 16 లక్షల మందికి పైగా కోవిడ్ టీకాలు వేశారు. సోమవారంతో వ్యాక్సినేషన్ ప్రక్రియ 157వ రోజుకు చేరుకుంది. హర్షం వ్యక్తం చేసిన ప్రధాని మోదీవ్యాక్సినేషన్ విషయంలో రికార్డు సాధించడంపై ప్రధాని హర్షం వ్యక్తం చేశారు. ‘‘ఈరోజు రికార్డు బ్రేకింగ్ స్థాయిలో వ్యాక్సినేషన్ ప్రక్రియ జరగడం ఆనందదాయకం. కోవిడ్‌ 19కు వ్యతిరేకంగా ఉన్న ఏకైక ఆయుధం వ్యాక్సిన్. వ్యాక్సిన్ వేయించుకున్న ప్రతి ఒక్కరికీ నా అభినందనలు. పౌరులకు వ్యాక్సిన్ సక్రమంగా అందేలా కృషి చేస్తున్న ఫ్రంట్‌లైన్ యోధులకు ధన్యవాదాలు. వెల్‌డన్ ఇండియా’’ అంటూ ప్రధాని మోదీ ట్విట్టర్ వేదికగా ప్రశంసించారు.


By June 21, 2021 at 11:28PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/india-record-breaking-vaccination-numbers-are-on-monday-pm-narendra-modi-appreciates/articleshow/83726730.cms

No comments