Breaking News

IMA Ex Chief కరోనాతో కన్నుమూసిన ప్రముఖ వైద్యుడు కేకే అగర్వాల్


ఇండియన్ మెడికల్ అసోసియేషన్ () మాజీ అధ్యక్షుడు, ప్రముఖ వైద్యుడు కరోనాతో కన్నుమూశారు. డాక్టర్ అగర్వాల్ ఢిల్లీలో ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి కన్నుమూశారు. కొద్ది రోజుల కిందట ఆయనకు కోవిడ్ సోకడంతో చికిత్స కోసం ఎయిమ్స్‌లో చేర్పించారు. ఆయన పరిస్థితి క్రమంగా దిగజారడంతో వెంటిలేటర్‌పైనే చికిత్స కొనసాగించారు. సోమవారం రాత్రి ఆరోగ్యం విషమించి రాత్రి 11.30 గంటలకు చనిపోయినట్టు కుటుంబసభ్యులు ట్విట్టర్ ద్వారా వెల్లడించారు. డాక్టర్ అగర్వాల్ కోవిడ్‌తో సుదీర్ఘ పోరాటం చేసిన ఓడిపోయారు. టీకా రెండు డోస్‌లను వేయించుకున్నా మహమ్మారి బారి నుంచి ఈ 62 ఏళ్ల వైద్యుడు తప్పించుకోలేకపోయారు. డాక్టర్ కేకే అగర్వాల్ దేశంలోని ప్రముఖ వైద్యుల్లో ఒకరు. ఆయన సేవలకు పద్మశ్రీ పురస్కారం వరించింది. గతేడాది కరోనా వైరస్ మొదలైనప్పటి నుంచి మహమ్మారి గురించి వీడియోలు, ప్రకటనల ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించారు. అంతేకాదు, ఫిబ్రవరిలో టీకా రెండో డోస్ తీసుకున్న తర్వాత తన ఫేస్‌బుక్ లైవ్ ద్వారా వ్యాక్సిన్ పట్ల ఉన్న భయం, అపోహలపై ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ‘‘వైద్యవృత్తిని చేపట్టినప్పటి నుంచి పద్మశ్రీ డాక్టర్ కేకే అగర్వాల్ తన జీవితాన్ని ప్రజల సంరక్షణ, ఆరోగ్యంపై అవగాహన కోసం అంకితం చేశారు.. మహమ్మారి సమయంలోనూ ప్రజలకు అవగాహన కల్పించడానికి నిరంతరం ప్రయత్నాలు చేశారు.. అనేక వీడియోలు, విద్యా కార్యక్రమాల ద్వారా 100 మిలియన్లకు పైగా ప్రజలకు చేరువై... లెక్కలేనన్ని ప్రాణాలను కాపాడారు’’ అని కుటుంబం ఓ ప్రకటనలో పేర్కొంది. ఆయన తన మరణంపై చింతించకూడదని కోరుకున్నారని కుటుంబం తెలిపింది.


By May 18, 2021 at 10:55AM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/padma-shri-dr-kk-aggarwal-ex-chief-of-india-medical-association-dies-of-covid-19/articleshow/82730608.cms

No comments