Breaking News

సినిమా రౌండప్: మరోసారి ‘ఫిదా’ చేయనున్న జంట.. ఇద్దరమ్మాయిలతో మహేశ్ రొమాన్స్


మరోసారి ‘ఫిదా’ చేయనున్న జంట ‘ఫిదా’ సినిమాతో వెండితెరపై మ్యాజిక్ చేశారు మరియు . ఈ సినిమా తర్వాత వీళ్లిద్దరు నిజజీవితంలో కూడా వివాహం చేసుకుంటున్నారనే వార్తలు వచ్చాయి. అయితే అవన్నీ పుకార్లే అని తర్వాత తేలింది. అయితే మరోసారి ఈ జంట కలిసి ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. వెంకీ కుడుముల దర్శకత్వంలో వీళ్లిద్దరు కలిసి ఓ సినిమా చేస్తున్నట్లు సమాచారం. హిందీ నేర్చుకుంటున్న రష్మిక దక్షిన సినీ పరిశ్రమల్లో మంచి సూపర్ హిట్లు అందుకున్న నటి రష్మిక మందన్న.. ఇప్పుడు బాలీవుడ్‌లో తన సత్తా చాటేందుకు రెడీ అవుతోంది. బిగ్‌బీ అమితాబ్‌తో *గుడ్‌బై’ అనే సినిమాలో, సిద్ధార్త్ మల్హోత్రాతో ‘మిషన్ మంజు’ అనే చిత్రంలో నటిస్తోంది. ఇందుకోసం ఆమె తన హిందీ పరిజ్ఙానాన్ని పెంచుకుంటోంది. ప్రత్యేకంగా ఓ ట్యూటర్‌ని పెట్టుకొని హిందీ నేర్చుకుంటోంది. ఈ సినిమాల్లో ఆమె స్వయంగా డబ్బింగ్ చెప్పాలని తాపత్రేయపడుతున్నట్లు సమాచారం. ఇద్దరు అమ్మాయిలతో మహేశ్ రొమాన్స్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ భారీ చిత్రం రూపొందనున్న సంగతి తెలిసిందే. హారికా అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఈ సినిమాను రూపొందిస్తున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ప్రతీ రోజు ఏదో ఒక అప్‌డేట్ తెలుస్తోంది. రీసెంట్‌గా ఈ సినిమా గురించి ఓ వార్త సోషల్‌మీడియాలో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో ఇద్దరు హీరోయన్లు నటిస్తున్నట్లు సమాచారం. అందులో ఒకరు పూజా హెగ్డే కాగా.. మరొక హీరోయన్‌గా ఓ ప్రముఖ బాలీవుడ్ నటి చేస్తున్నట్లు తెలుస్తోంది. బాధ్యతగా సినిమాలు చేయాలి అంటున్న మారుతి కరోనా సెకండ్ వేవ్ కారణంగా గ్యాప్ రావడంతో తాను కొత్త స్క్రిప్టులు రాసుకొనే పనిలో ఉన్నానంటూ దర్శకుడు మారుతి తెలిపారు. ప్రస్తుతం ఆయన గోపిచంద్‌తో ‘పక్కా కమర్షియల్’ అనే సినిమా చేస్తున్నారు. అయితే ఈ మధ్య చూసిన సినిమాల్లో ‘సినిమా బండి’ అనే చిత్రం తనకు ఎంతో నచ్చిందని ఆయన పేర్కొన్నారు. అలా మంచి స్క్రిప్టులతో మరింత బాధ్యతతో సినిమాలు చేయాలి. ప్రస్తుతం నా దృష్టంతా దానిపైనే ఉంది'' అని మారుతి చెప్పుకొచ్చారు. ఈసారి కూడా స్టార్ హీరోతో ‘వకీల్‌సాబ్’ దర్శకుడు పవర్‌స్టార్ పవన్‌కళ్యాణ్ రీఎంట్రీ చిత్రానికి దర్శకత్వం వహించిన వేణు శ్రీరామ్.. మంచి మార్కులే కొట్టేశారు. ఈ సినిమాలో పవన్‌కళ్యాణ్‌ను వేణు శ్రీరామ్ చూపించిన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి. అయితే ఈ సినిమా తర్వాత అతను ఎలాంటి చిత్రం చేస్తాడా అనే ఆసక్తి మొదలైంది. ప్రస్తుతం ఆయన రెండు పెద్ద బ్యానర్లతో చర్చలు జరుపుతున్నారని సమాచారం. ఏ బ్యానర్ వారు ఓకే చెప్పినా, సెట్స్ పైకి వెళ్లేది స్టార్ హీరోతోనేనని తెలుస్తోంది.


By May 18, 2021 at 10:18AM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/may-17-movie-roundup-mahesh-babu-varun-tej-and-sai-pallavi/articleshow/82729977.cms

No comments