Breaking News

కరోనాతో చనిపోయిన తండ్రి.. చితి మంటల్లోకి దూకేసిన కూతురు


కరోనా సెకండ్ వేవ్‌తో దేశం మొత్తం అతలాకుతలం అవుతోంది. కరోనా సోకి వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. కొన్ని సందర్భంగా కుటుంబసభ్యులు కడసారి చూపు కూడా చూసుకోలేకపోతున్నారు. మరికొంత మంది కరోనా సోకిందన్న భయంతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. తాజాగా రాజస్థాన్‌‌లోని బార్మెర్ జిల్లా రాయ్ కాలనీలో విషాద ఘటన చోటుచేసుకుంది. కరోనాతో చనిపోయిన తండ్రికి అంత్యక్రియుల నిర్వహిస్తు్ండగా ఓ యువతి మంటల్లోకి దూకేసింది. రాయ్‌ కాలనీకి చెందిన దామోదర్ దాస్ అనే వ్యక్తికి ఇటీవల కరోనా సోకింది. పరిస్థితి విషమించటంతో అతడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో స్థానిక పంచాయతీ సిబ్బంది, కుమార్తెలు, ఇతర బంధువుల సమక్షంలో అంత్యక్రియలు నిర్వహించారు. దామోదర్ దాస్ చితికి నిప్పటించిన వెంటనే అతడి కుమార్తె శారద చితిపైకి దూకేసింది. ఈ ఘటనతో అక్కడున్న వారందరూ షాకయ్యారు. వెంటనే తేరుకుని ఆమెను రక్షించి సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెబుతున్నారు.


By May 05, 2021 at 03:40PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/sadden-over-father-demise-rajasthan-girl-jumps-into-burning-pyre/articleshow/82404031.cms

No comments