Breaking News

వీళ్లు కరోనా కంటే ప్రమాదకరం.. ముగ్గురి చేతిలో బలైపోయిన పదహారేళ్ల బాలిక


ఓ వైపు దేశం కరోనాతో అల్లాడుతుంటే కొందరు మాత్రం కామంతో రెచ్చిపోతున్నారు. ఈ నేపథ్యంలోనే పీయూసీ మొదటి సంవత్సరం చదువుతున్న బాలికపై కొందరు కామాంధులు సామూహికంగా అత్యాచారానికి పాల్పడి అనంతరం హత్య చేశారు. ఈ దారుణ ఘటన కర్నాటకలోని యాదగిరి జిల్లా సురపుర తాలూకా హుణిసిగిలో ఆలస్యంగా వెలుగుచూసింది. హుణిసిగిలో వ్యవసాయ కుటుంబానికి చెందిన బాలిక (16) పీయూసీ చదువుతోంది. కరోనా నేపథ్యంలో కాలేజీకి సెలవులు ఇవ్వడంతో కొద్దిరోజులుగా ఇంటి వద్దనే ఉంటోంది. ఈ నెల 9వ తేదీన ఓ పని నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లిన బాలికను ముగ్గురు యువకులు బలవంతంగా సమీపంలోని పొలాల్లోకి లాక్కెళ్లారు. ముగ్గురూ కలిసి ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. ఈ విషయం ఎవరికైనా చెబితే తమకు జైలుశిక్ష తప్పదని భావించిన ఆ కామాంధులు ఆమెను బండరాళ్లతో కొట్టి చంపేసి పరారయ్యారు. కూతురు కనిపించకపోవడంతో ఆందోళన పడిన తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు చుట్టుపక్కల ప్రాంతాల్లో గాలించగా పట్టణ శివారులోని పొలాల్లో బాలిక మృతదేహం కనిపించింది. మృతదేహాన్ని ఆస్పత్రిక తరలించి పోస్టుమార్టం నిర్వహించగా గ్యాంగ్ రేప్ జరిగినట్లు తేలింది. దీంతో పోలీసులు దర్యాప్తు చేపట్టి హుణిసిగి పట్టణానికి చెందిన విజయ్‌కుమార్‌ (18) అరెస్ట్‌ చేశారు. అతడితో పాటు 16, 17 ఏళ్ల వయసున్న మరో ఇద్దరు బాలురు కూడా అత్యాచారానికి పాల్పడినట్లు నిర్ధారించారు. పరారీలో ఉన్న ఆ ఇద్దరి కోసం పోలీసులు గాలిస్తున్నారు.


By May 12, 2021 at 12:45PM


Read More https://telugu.samayam.com/latest-news/crime/16-yrs-girl-gang-raped-and-killed-in-karnataka/articleshow/82569141.cms

No comments