Breaking News

స్విమ్మింగ్‌ పూల్లో దూకి అమాంతం పైకి లేపారు.. శ్రీహరి కారణంగా బయటపడ్డా.. షాకింగ్ విషయాలు చెప్పిన రజిత


తెలుగు ప్రేక్షకులకు బాగా సుపరిచితం సీనియర్ యాక్ట్రెస్ . నటిగా కొన్ని వందల సినిమాల్లో నటించిన అనుభవం ఆమె సొంతం. క్యారెక్టర్ ఆర్టిస్టుగా అమ్మ, అక్క, వదిన, అత్త పాత్రల్లో నటించి ప్రేక్షకుల మెప్పుపొందిన ఆమె తాజాగా '' ప్రోగ్రాంలో మాట్లాడుతూ తన వ్యక్తిగత విషయాలపై ఓపెన్ అయింది. జీవితంలో తనకు ఎదురైన చేదు ఘటనల గురించి వివరించింది. తన స్వస్థలం కాకినాడ అని చెప్పిన రజిత.. ఏదో అలా సినిమా షూటింగ్ చూద్దామని చెన్నై వెళితే అనుకోకుండా సినిమా అవకాశం వచ్చిందని, అలా సినిమాల్లో సెట్టయిపోయానని చెప్పింది. 1987లో సినీ గడపతొక్కి ఒక్క పెద్ద ఎన్టీఆర్‌తో తప్ప అప్పట్లో దాదాపు అందరు హీరోలతో వర్క్ చేశానని తెలిపింది. అక్కినేని కుటుంబంలో అయితే నాగేశ్వర రావుతో పాటు ఆయన కొడుకు నాగార్జున, మనవడు నాగ చైతన్యతోనూ కలిసి పనిచేశానని చెప్పుకొచ్చింది. కృష్ణ గారు హీరోగా సంఘవి హీరోయిన్‌గా నటిస్తున్న ‘బొబ్బిలిదొర’ సినిమాలోని ఓ సన్నివేశం షూట్ చేస్తుండగా స్విమ్మింగ్‌ పూల్‌లో పడిపోతే శ్రీహరి రక్షించారని చెప్పింది రజిత. కాలేజీలో ర్యాగింగ్‌ చేస్తూస్విమ్మింగ్‌ పూల్‌లో తోసే సీన్ అది. నాకు ఈత రాదని ముందే చెప్పా. షూటింగ్ షాట్ అయిపోయింది. నేను స్విమ్మింగ్‌ పూల్‌లోనే ఉండిపోయా. అంతా అక్కడినుంచి వెళ్లిపోవడంతో నా లైఫ్ ఫినిష్ అనుకున్నా. అక్కడే ఉన్న శ్రీహరి గారు నన్ను గమనించి ఒక్కసారిగా స్విమ్మింగ్‌ పూల్‌లో దూకేసి నన్ను అమాంతంగా తన చేతులతో బయటపడేసి నా ప్రాణాలు కాపాడారు అని రజిత చెప్పింది. ఇకపోతే తనకు ట్రైన్ ఫోబియా అనేది ఒకటుందని చెప్పిన రజిత.. కొన్ని సందర్భాల్లో ట్రైన్‌లో ఎదుర్కొన్న చేదు అనుభవాల గురించి వివరించింది. అప్పట్లో మద్రాస్ నుంచి హైదరాబాద్‌ రావడానికి ఫస్ట్ క్లాస్ బోగీలో వస్తున్నానని, అయితే ట్రైన్ రన్నింగ్‌లో వాష్‌ రూమ్ వెళ్లి వచ్చేటప్పుడు ఎదురుగా నిల్చున్న ఆకతాయిలు నన్ను గట్టిగా పట్టుకొని హగ్‌ చేసుకొని ముద్దు పెట్టుకోవాలని ప్రయత్నించారని ఆమె చెప్పింది. ఎలాగోలా వాళ్ళను విదిలించుకొని వచ్చేసి నాతోటి ఆర్టిస్టులకు చెప్పేసరికి ఆ పోకిరీలు పారిపోయారని తెలిపింది. అప్పటి నుంచి నాకు ట్రైన్ ఫోబియా పట్టుకుందని, ఒక్కదాన్నే ట్రైన్‌లో వెళ్లాలంటే భయం అని చెప్పుకొచ్చింది రజిత. ఆ తర్వాత ఓ సారి రైలులో ప్రయాణిస్తుండగా ఓ టీసీ అతి అభిమానంతో ఆర్‌ఏసీ టికెట్‌ కన్ఫమ్ చేసి 'మీరు విజయవాడ వరకు నాతోనే కూర్చుని ప్రయాణం చేయాలి' అన్నాడని, ఆ సమయంలో కూడా కాస్త ఇబ్బంది పడ్డానని రజిత చెప్పింది.


By May 12, 2021 at 12:27PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/actress-rajitha-says-about-her-bad-experience-in-train-journey/articleshow/82569107.cms

No comments