Breaking News

గుండె పగిలింది.. అది మాటల్లో చెప్పలేని బాధ.. ఆందోళనలో ఉన్నానంటూ పాయల్ తీవ్ర ఆవేదన


దేశంలో కరోనా సెకండ్ వేవ్ ఉదృతి కొనసాగుతోంది. మహమ్మారి వైరస్ దాటికి జనం పిట్టల్లా రాలిపోతున్నారు. సాధారణ, సెలబ్రిటీ అనే తేడాలేకుండా అందరి జీవితాలను ఛిద్రం చేస్తోంది కరోనా వైరస్. ఎన్నో కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగుల్చుతున్న కోవిడ్.. హీరోయిన్ ఇంట్లోనూ తీవ్ర విషాదాన్ని నింపింది. కరోనా కారణంగా తనకు బాగా కావాల్సిన ఇద్దరు వ్యక్తులను కోల్పోయింది పాయల్. దీంతో తీవ్ర ఆవేదన చెందుతూ తన ఇన్స్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ పెట్టింది. పాయల్ రాజ్‌పుత్ ప్రియుడు సౌరభ్ డింగ్రా తల్లి అనిత కరోనా కారణంగా ఇటీవలే మరణించగా.. మరో సన్నిహితమైన వ్యక్తి ఆమెకు దూరమయ్యారట. అస్సలు ఊహించని ఈ రెండు సంఘటనలతో మానసిక కుంగుబాటుకు లోనయ్యానని అంటూ ఆమె ఓ సందేశం పోస్ట్ చేసింది. దేశవ్యాప్తంగా పరిస్థితులు దారుణంగా మారాయని.. అందరూ ఇంటికే పరిమితమై తమ ప్రియమైన వారిని సంరక్షించుకోవాలని ఈ పోస్ట్ ద్వారా ఆమె తెలిపింది. ''నా జీవితంలో ఇంతటి క్లిష్టమైన పరిస్థితులు చూడటం ఇదే తొలిసారి. మానసికంగా కుంగిపోయి చాలా ఆందోళన చెందుతున్నా. నా బాధను బయటకు చెప్పడానికి మాటలు చాలవు. బయటకొచ్చి గట్టిగా ఏడవాలనిపిస్తోంది. ఈ కరోనా కారణంగా తమ ప్రియమైన వారిని కోల్పోయిన వారికి దేవుడు ధైర్యాన్ని, మానసిక స్థైర్యాన్ని ఇవ్వాలని కోరుకుంటున్నా'' అని పాయల్ తన పోస్ట్‌‌లో పేర్కొన్నారు. మొదటి సినిమా Rx100తో టాలీవుడ్ ఆడియన్స్‌ని బుట్టలో వేసుకుంది పాయల్. కెమెరా ముందు అందచందాలు వడ్డించడమే గాక తనదైన అభినయంతో ఆకట్టుకున్న ఈ అమ్మడు.. ఆ తర్వాత వరుస అవకాశాలు పట్టేసింది. ఇటీవలే 'సీత' సినిమాలో ఐటెం సాంగ్ చేసి ఉర్రూతలూగించిన ఆమె ''వెంకీ మామ, డిస్కో రాజా'' సినిమాలతో అలరించింది.


By May 20, 2021 at 12:11PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/payal-rajput-emotional-post-on-her-family-members-death/articleshow/82792892.cms

No comments