Breaking News

హైకోర్టులు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలు.. ఆ ఫిర్యాదుపై ఈసీకి సుప్రీం హితబోధ


హత్యకేసు నమోదుచేయాలంటూ చేసిన తమపై చేసిన వ్యాఖ్యలపై సుప్రీంకోర్టుకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై సోమవారం విచారించిన సర్వోన్నత న్యాయస్థానం.. హైకోర్టు చేసిన కఠినమైన వ్యాఖ్యలను సానుకూల దృక్పథంతో తీసుకోవాలని సూచించింది. ఇంత సున్నితమైన పరిస్థితుల్లో సంయమనం పాటించాలని హైకోర్టులను తాము కోరలేమని స్పష్టం చేసింది. ఎన్నికల ప్రచారంలో రాజకీయ పార్టీలు కోవిడ్ నిబంధనలు పాటించేలా చేయడంలో ఈసీ వైఫ్యలం చెందిందని మద్రాస్ హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే. ఓ రాజ్యాంగ సంస్థపై మద్రాస్ హైకోర్టు పరుష పదజాలంతో చేసిన వ్యాఖ్యలు తమను తీవ్రంగా బాధించాయని సుప్రీంకోర్టుకు ఈసీ వివరించింది. ఈసీ పిటిషన్‌పై విచారణ చేపట్టి డీవై చంద్రచూడ్, జస్టిస్ ఎంఆర్ షాల ధర్మాసనం.. హైకోర్టులు ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలని, వాటిని, వాటి ప్రాధాన్యతను తగ్గించలేమని స్పష్టం చేసింది. మద్రాస్ హైకోర్టు చేసిన విమర్శనాత్మక వ్యాఖ్యలు తరచుగా న్యాయవాదులు, ధర్మాసనం మధ్య బహిరంగ సంభాషణలో జరుగుతాయని గమనించామని తెలిపింది. తాము అటువంటి పరుషమైన భాషను ఉపయోగించలేం కానీ, మహమ్మారి వ్యాప్తిలో ఉన్నప్పుడు ఎన్నికలప్పుడు కొన్ని లోపాలు ఉన్న నేపథ్యంలో ఇలాంటి వ్యాఖ్యలను ‘చేదు మాత్రలు’ లాగా తీసుకోవలసిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. ఈసీ తరఫున హాజరైన సీనియర్ న్యాయవాది రాకేశ్ ద్వివేది వాదనలు వినిపించారు. ఎన్నికల ర్యాలీలలో పాల్గొనే ప్రజలను నియంత్రించే సిబ్బంది లేరని, కోవిడ్ కట్టడి నిర్వహణ ఈసీ బాధ్యత కాదని అన్నారు. అలాగే, మీడియాను నిరోధించాలన్న ఈసీ విజ్ఞ‌ప్తిని మద్రాసు హైకోర్టు తోసిపుచ్చడాన్ని సమర్ధించింది. ఈ విషయంలో మీడియాను నిరోధించలేమని ఉద్ఘాటించింది. ‘‘ప్రజాస్వామ్యంలో మీడియా అత్యంత శక్తివంతమైంది.. రిపోర్టింగ్ చేయకుండా ఉన్నత న్యాయస్థానాలు నిరోధించలేవు’’ వ్యాఖ్యానించింది. ఈసీ తక్కువచేయడం మద్రాస్ హైకోర్టు ఉద్దేశం కాదని పేర్కొంది. దీనిపై గురువారం ఆదేశాలు వెలువరిస్తామని చెప్పింది.


By May 03, 2021 at 02:06PM


Read More https://telugu.samayam.com/latest-news/india-news/high-courts-they-are-key-pillars-of-democracy-sc-on-ec-plea/articleshow/82368294.cms

No comments