Breaking News

‘నా నెక్ట్స్ ప్రాజెక్టులు అవే.. ముగ్గురు స్టార్లతో సినిమా చేస్తున్నాను..’ క్లారిటీ ఇచ్చిన అనిల్ రావిపూడి


గత ఏడాది సూపర్‌స్టార్ హీరోగా.. ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్నాడు దర్శకుడు అనిల్ రావిపూడి. పూర్తిస్థాయి కామెడీ, సెంటిమెంట్‌తో పాటు మంచి కమర్షియల్ సినిమాలు చేస్తూ.. తెలుగు ప్రేక్షకులను అలరిస్తున్నాడు అతను. ప్రస్తుతం తన సూపర్ హిట్ సినిమా ‘ఎఫ్‌2’కి సీక్వెల్‌గా ‘ఎఫ్‌3’ అనే సినిమా రూపొందిస్తున్నాడు. అయితే ఈ సినిమా షూటింగ్ కరోనా కారణంగా ఆగిపోయింది. కూడా కరోనా బారిన పడి ఈ మధ్యే కోలుకున్నాడు. తాజాగా తన తదుపరి ప్రాజెక్టుల గురించి అనిల్ క్లారిటీ ఇచ్చాడు. ఈ మధ్యకాలంలో తదుపరి సినిమాల గురించి అత్యధిక రూమర్లు వచ్చిన దర్శకుడు ఎవరైనా ఉన్నారంటే.. అది అనిల్ రావిపూడినే. ఎఫ్‌3 సినిమా తర్వాత అనిల్, నందమూరి బాలకృష్ణ కాంబినేషన్‌‌‌లో ఒక సినిమా, ఆ తర్వాత మహేశ్ బాబుతో మరో సినిమా.. అనంతరం రవితేజాతో ‘రాజా ది గ్రేట్’ సినిమా సీక్వెల్ చేస్తున్నాడని వార్తలు వచ్చాయి. అంతేకాక.. రవితేజ సినిమాలో రామ్ కూడా నటిస్తున్నాడని పుకార్లు వచ్చాయి. అయితే వీటిలో దేన్ని నమ్మాలో దేన్ని నమ్మకూడదో అనే కన్ఫ్యూజన్‌లో ఫ్యాన్స్ పడిపోయారు. తాజాగా ఈ వార్తలు అన్నింటిపై అనిల్ స్పందించాడు. ఈ వార్తలు అన్ని వాస్తవాలే అని అతను తెలిపాడు. తన తదుపరి సినిమాల గురించి అతను మాట్లాడుతూ.. ‘‘బాలకృష్ణతో సినిమాకి స్క్రిప్ట్ రెడీ అయింది. ఇది ఒక డిఫరెంట్ జోనర్‌లో సాగే సినిమా. కానీ, ఇది మల్టీస్టారర్ కాదు. ఇక మహేశ్‌బాబుతో మరో సినిమా కూడా చేయాల్సి ఉంది. సరిలేరు నీకెవ్వరు సమయంలోనే దీనిపై చర్చ జరిగింది. స్టోరీ కూడా మహేశ్ ఓకే చెప్పారు. అయితే త్రివిక్రమ్ సినిమా ముందుకు రావడం వల్ల ఇది ఆలస్యం అవుతోంది. ఇక రవితేజాతో ‘రాజా ది గ్రేట్’ సినిమా సీక్వెల్ చేసే ఆలోచన కూడా ఉంది. కానీ, దీనిపై డిస్కషన్ ఇంకా జరగలేదు’’ అని స్పష్టం చేశాడు.


By May 09, 2021 at 01:15PM


Read More https://telugu.samayam.com/telugu-movies/cinema-news/anil-ravipudi-gives-clarity-about-his-upcoming-movies/articleshow/82495169.cms

No comments